ఇఫ్తార్‌ ముగించి ఇంటికొస్తున్న బాలుడి కిడ్నాప్‌.. దారుణహత్య

మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్‌లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Published : 27 Mar 2024 03:48 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్‌లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గోరేగావ్‌కు చెందిన సల్మాన్‌ మౌల్వీ అనే యువకుడు దర్జీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చాలాకాలం నుంచి ఇల్లు కట్టుకోవాలని అనుకొంటున్నా తగినంత డబ్బు లేకపోవడంతో ఎవరినైనా కిడ్నాప్‌ చేసి డబ్బు సంపాదించాలని కుట్ర పన్నాడు. స్థానికంగా ఉంటున్న  ఇదాబ్‌ అనే బాలుడు ఆదివారం సాయంత్రం మసీదులో ఇఫ్తార్‌ ముగిశాక ఇంటికి తిరిగి వెళ్తుండగా అతణ్ని కిడ్నాప్‌ చేశాడు. బాలుడిని ఇంటికి తీసుకువెళ్లి గోనెసంచిలో కట్టేసి పెరట్లో దాచాడు. బాలుడి తండ్రికి ఫోను చేసి రూ.23 లక్షలు ఇవ్వకపోతే ఇదాబ్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఈ విషయం సల్మాన్‌కు తెలిసి  మొబైల్‌లోని సిమ్‌కార్డు తొలగించాడు. గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు సల్మాన్‌ ఇంటిని తనిఖీచేయగా గోనెసంచిలో కట్టిపడేసిన బాలుడి మృతదేహం కనిపించింది. నిందితుణ్ని అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘటనలో సల్మాన్‌ సోదరుడు సఫువాన్‌ మౌల్వీ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానించి అతణ్ని కూడా అదుపులోకి తీసుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని