Kolkata Vs Punjab: క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: కోల్కతా - పంజాబ్ (Kolkata Vs Punjab) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 523 పరుగులు నమోదయ్యాయి. తొలుత కోల్కతా 261 పరుగులు చేయగా.. పంజాబ్ 262 పరుగులు సాధించింది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు నమోదైన మూడో మ్యాచ్గా నిలిచింది. ఇదే సీజన్లో బెంగళూరు-హైదరాబాద్ మధ్య జరిగిన పోరులో ఏకంగా 549 రన్స్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టు విజయం సాధించడంపై పంజాబ్ కెప్టెన్ ఆనందం వ్యక్తం చేస్తూనే కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఈ విజయం మాకు చాలా కీలకం. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్లోనూ గెలవాలి. ఇప్పుడు భారీ టార్గెట్ను ఛేదించడం ఆనందంగా ఉంది. ఇటీవల బ్యాటర్ల దూకుడు ఎక్కువైంది. దీంతో క్రికెట్ బేస్బాల్ గేమ్లా మారిపోతోంది. మాకు రాబోయే మ్యాచ్లు అత్యంత కీలకం. కఠిన సవాల్ తప్పదు. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మా కుర్రాళ్లు కూడా అదే విధంగా సన్నద్ధమవుతున్నారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కోచ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జానీ బెయిర్స్టో, శశాంక్ ఇన్నింగ్స్ హైలైట్. మరీ ముఖ్యంగా ఈ టోర్నీ ద్వారా శశాంక్ వంటి అద్భుతమైన క్రికెటర్ మాకు లభించాడు. అశుతోష్ కూడా కీలక ఇన్నింగ్స్లతో మెప్పించాడు. జట్టులోని ప్రతి ఒక్కరి ఆటపై గర్వంగా ఉంది’’ అని సామ్ కరన్ వ్యాఖ్యానించాడు.
పొరపాటు ఎక్కడో అన్వేషించాలి: శ్రేయస్
‘‘భారీ లక్ష్యం నిర్దేశించినా మాకు ఓటమి ఎదురు కావడం బాధగా ఉంది. ఇరు జట్ల బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ అదరగొట్టారు. ఈడెన్ గార్డెన్స్లోని ప్రేక్షకులతోపాటు మ్యాచ్ చూసినవారందరికీ కనులపండుగే. 260+ టార్గెట్ను కాపాడుకోలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరి చేసుకుంటాం’’ అని కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
మరికొన్ని విశేషాలు..
- ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్ ఇదే. పంజాబ్ బ్యాటర్లు 24 సిక్స్లు బాదారు. టీ20 చరిత్రలో పంజాబ్ కంటే నేపాల్ మాత్రమే (26 సిక్స్లు) ముందుంది.
- ఓవరాల్గా టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్స్లు నమోదైన మ్యాచ్గా రికార్డు సృష్టించింది. పంజాబ్ 24 బాదగా.. కోల్కతా 18 సిక్స్లను కొట్టింది. మొత్తం 42 సిక్స్లతో టాప్లో నిలిచింది.
- ఐపీఎల్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ లిస్ట్లో ఇది మూడో మ్యాచ్. ఇదే సీజన్లో బెంగళూరు-హైదరాబాద్ (549), హైదరాబాద్ - ముంబయి (523), కోల్కతా - పంజాబ్ (523) పరుగుల వర్షం కురిసింది.
- ఐపీఎల్లోనే కాదు మొత్తంగా టీ20 క్రికెట్లో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. గత ఏడాది వెస్టిండీస్పై 259 పరుగుల ఛేదనతో దక్షిణాఫ్రికా రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్లో 2020లో పంజాబ్పై రాజస్థాన్ (224) విజయం సాధించింది.
- టీ20 క్రికెట్లో 250+ స్కోర్లను చేసిన కోల్కతా ఏడో జట్టుగా నిలిచింది. ఈ జట్టు ఇది రెండోసారి నమోదు చేసింది. సర్రే (3), హైదరాబాద్ (3), చెక్ రిపబ్లిక్ (2), సోమర్సెట్ (2), యార్క్షైర్ (2), బెంగళూరు (2) ముందున్నాయి.
- ప్రస్తుత సీజన్లో 250+ స్కోర్లు నమోదు కావడం ఆరోసారి. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో 8 సార్లు భారీ స్కోర్లను జట్లు సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య