బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది.
తండ్రి, నాటువైద్యుడి నిర్వాకం
మూడున్నరేళ్ల తర్వాత విషయం వెలుగులోకి..
కుమురంభీం జిల్లాలోని రెబ్బెన మండలంలో ఘటన
రెబ్బెన, న్యూస్టుడే: నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. ఇన్నాళ్లుగా వేదనను భరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమురంభీం జిల్లా రెబ్బెన సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషి (11)కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో 2020 నవంబరులో ఇదే మండలంలోని పాసిగాం శివారులో ఆశ్రమం నడిపిస్తున్న బామిని భీమ్రావు వద్ద చేర్పించారు. అతను నూనె రాస్తే రోగం నయమవుతుందని నమ్మించేవాడు. ఈ క్రమంలో బాలుడికి నాటు వైద్యం చేసేవాడు. శ్రీనివాస్ అతన్ని పూర్తిగా విశ్వసించాడు. నాటు వైద్యం వికటించడంతో కొద్ది రోజులకు బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా శ్రీనివాస్తో కలిసి భీమ్రావు ఆశ్రమం వెనుక మృతదేహాన్ని పాతిపెట్టాడు. బాబు ఎలా ఉన్నాడని ఆ తల్లి తన భర్తను ఎన్నోసార్లు ప్రశ్నించగా.. ఆశ్రమంలోనే ఉన్నాడని, ఆరోగ్యం మెరుగవుతోందంటూ నమ్మబలికేవాడు. కొన్నిసార్లు ఆమె ఆశ్రమానికి వెళ్లినా.. బాబు లోపల నిద్రపోతున్నాడని, చూడటానికి వీలుపడదని భీమ్రావు, శ్రీనివాస్లు నమ్మించారు.
అంతేకాకుండా ఆమెను ఇద్దరూ వేధింపులకు గురిచేసేవారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన ఆమె గత 11 నెలలుగా భర్తను వదిలి పుట్టింట్లో ఉంటున్నారు. ఎప్పటికీ కుమారుడిని చూపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె తన పుట్టింటివారి సహకారంతో ఈ నెల 16న రెబ్బెన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈ మేరకు గురువారం బాలుడి మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని భీమ్రావు, శ్రీనివాస్లు సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్లకు చూపించారు. సీఐ పర్యవేక్షణలో తహసీల్దార్ జ్యోత్స్న, ఫోరెన్సిక్ నిపుణుడు సురేందర్రెడ్డి సమక్షంలో అక్కడ తవ్వించగా బాలుడి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఘటనా స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య పరిశీలించారు. డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు భీమ్రావు, శ్రీనివాస్లను అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు హోంగార్డు తాను పనిచేస్తోన్న పోలీస్స్టేషన్లోనే రూ.5.6లక్షలు కాజేశాడు. -
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. -
మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. అప్పుల కారణంగా మానసికంగా కుంగిపోయిన ఓ వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. -
ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా
తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పోలీసులు అరెస్టు చేశారు. -
మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. -
సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి పేరుతో నకిలీ ఖాతాలు
తన పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సివిల్స్ మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?