ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లో మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం
దుమ్ముగూడెం, చర్ల, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూఝ్మడ్ అటవీ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఎదురుకాల్పుల ఘటన జరిగిన రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ దండకారణ్యం నెత్తురోడింది. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టులు అబూఝ్మడ్లో సమావేశం అవుతున్నారన్న నిఘావర్గాల సమాచారంతో డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), ఎస్టీఎఫ్(స్పెషల్ టాస్క్ ఫోర్స్) బెటాలియన్ల నేతృత్వంలోని బృందాలు సోమవారం రాత్రి నుంచి గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో టేక్మెట, కాకూరు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల మధ్య 3 గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి ఏకే-47 రైఫిల్తోపాటు పేలుడు పదార్థాలు, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ సాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరికొందరు పరారయ్యారని, భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. తాజా ఘటనతో కాంకేర్, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 91 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల అనంతరం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి విజయ్శర్మ మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్చల ద్వారా ఈ విషయానికి పరిష్కారం చూపాలని భావిస్తోంది. చిన్నా, పెద్దా ఏ మావోయిస్టు దళంతోనైనా వీడియోకాల్ లేదా మధ్యవర్తుల ద్వారా చర్చలకు సిద్ధం. జనజీవన స్రవంతిలో కలవండి’’ అని మావోయిస్టులకు పిలుపునిచ్చారు.
బీజాపుర్లో 16 మంది లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు మంగళవారం ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. దండకారణ్యం ప్రాంతానికి చెందిన వీరంతా కొంతకాలంగా మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
ఛత్తీస్గఢ్ నారాయణ్పుర్ జిల్లాలోని ఆముదై మైన్స్లో కూలి పనులకు వెళ్లివస్తూ మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై అడుగు వేయడంతో అది పేలి కార్మికుడు ముఖేష్ పటేల్(38) మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ ఉన్నట్లు కమిషనర్ దయానంద్ చెప్పారు. -
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
Pune car Crash: బాలుడి డ్రైవింగ్తో ఇద్దరు మృతి చెందిన ఘటన రోడ్డు ప్రమాదం కాదని, హత్య అని బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. -
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్నగర్లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. -
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. -
డీజీపీ ఫొటోతో వాట్సప్ డీపీ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు
తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. -
కోటపల్లిలో చిరుతపులి చర్మం స్వాధీనం
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద సోమవారం చిరుతపులి చర్మాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ తెలుగు సినీ, బుల్లితెర నటులు!
బెంగళూరు శివారులోని జీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన రేవ్ పార్టీపై నగర నేర నియంత్రణ దళం పోలీసులు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. -
ఆమెను నమ్మి.. వందల కోట్లు మోసపోయారు!
బిడ్డల ఉన్నత చదువుల కోసం కొందరు.. వారి వివాహాల కోసం కొందరు.. పెన్షన్లా ఉపయోగపడుతుందని మరికొందరు తమ కష్టార్జితాన్ని ప్రయివేటు ఫైనాన్స్ సంస్థలో పొదుపు చేశారు. -
రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.5 వేలు.. బిల్లు మంజూరుకు రూ.7 వేలు లంచం..!
హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దారు కార్యాలయంలో ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
యూపీలో ఎనిమిది సార్లు ఓటేసిన మైనర్ అరెస్ట్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న నాలుగో విడత పోలింగ్లో 17 ఏళ్ల యువకుడు ఏకంగా ఎనిమిది సార్లు ఓటేశాడు. -
నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
జల్పాయిగుడిలో రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దుండగుల దాడి
పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయిగుడి జిల్లాలోని తమ ఆశ్రమంపై ఆదివారం కొందరు దుండగులు దాడి చేశారని రామకృష్ణ మిషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఒడిశాలో పోలింగ్ కేంద్రం వద్ద ఒకరి హత్య
ఒడిశాలోని బరగఢ్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని సొరొసొరాకు చెందిన ఆటోడ్రైవర్ బిశ్వనాథ్ (35)ను సోమవారం మధ్యాహ్నం ఒక పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రత్యర్థులు హతమార్చారు. -
ఛత్తీస్గఢ్లో లోయలో పడిన వాహనం.. 18 మంది గిరిజనుల దుర్మరణం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లా(కవర్ధా) బహపానీ గ్రామ సమీపంలో సోమవారం ఓ వాహనం లోయలో పడి 18 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
-
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
-
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
-
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ