మహారాష్ట్రలో ఆర్టీసీ బస్సు, ట్రక్కు ఢీ

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Published : 01 May 2024 05:32 IST

నలుగురి మృతి, 34 మందికి గాయాలు

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 34 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాంద్‌వడ్‌ సమీపంలోని రాహుద్‌ ఘాట్‌ వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని