Crime news: మొబైల్ కోసం వ్యక్తి దారుణ హత్య
గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని గుడిమల్కాపూర్లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన వ్యాపారం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రతిఘటించిన సనావుల్లాను కత్తితో ఛాతీపై పొడిచారు. అనంతరం దుండగులు మొబైల్ తీసుకొని బైక్పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాను రూపంలో మాటు వేసిన మృత్యువు
భార్య కాలినొప్పితో బాధపడుతుండటంతో వైద్యుడికి చూపించేందుకు తీసుకెళ్తున్న భర్తను ఓ మోడువారిన చెట్టు రెప్పపాటులో బలి తీసుకుంది. వారి కోసమే కాచుకొనుందా అన్నట్లు ఆ దంపతులు ద్విచక్రవాహనంపై ఆసుపత్రి ఆవరణలోకి రాగానే ఒక్కసారిగా మీద పడింది. -
ఏసీబీ వలలో ఏసీపీ
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. -
రేవ్ పార్టీలో తెలుగు నటులు.. నటి హేమ కూడా హాజరు
బెంగళూరు నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీకి తెలుగు సినీ నటి హేమ హాజరైనట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మంగళవారం ప్రకటించారు. ‘నేనేమీ ఆ పార్టీకి హాజరు కాలేదు’ అంటూ ఆమె సోమవారం ఓ వీడియో విడుదల చేయడంతో పోలీసులు ఈ వివరణ ఇచ్చారు. -
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరులోని రామేశ్వరం కెఫే పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు