బాలికపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(15)పై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్ వివరాల మేరకు.. శంకర్పల్లి పట్టణానికి చెందిన శేఖర్(35)
పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
శంకర్పల్లి మున్సిపాలిటీ, న్యూస్టుడే: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(15)పై ఓ కానిస్టేబుల్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్ వివరాల మేరకు.. శంకర్పల్లి పట్టణానికి చెందిన శేఖర్(35) నగరంలోని కూకట్పల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లో కొంతకాలంగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. బుధవారం ఆ కుటుంబానికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా.. గమనించిన కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం