బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(15)పై ఓ కానిస్టేబుల్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్‌ వివరాల మేరకు.. శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శేఖర్‌(35)

Published : 02 Dec 2021 05:34 IST

పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక(15)పై ఓ కానిస్టేబుల్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్సై సంజీవ్‌ వివరాల మేరకు.. శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శేఖర్‌(35) నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ఇంట్లో కొంతకాలంగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. బుధవారం ఆ కుటుంబానికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా.. గమనించిన కానిస్టేబుల్‌ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని