వైకాపా నేత పొట్లూరి, అనుచరులపై కేసు

వైకాపా నేత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), అతని అనుచరులపై మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషనులో కేసు

Published : 18 Jan 2022 04:21 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వైకాపా నేత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ), అతని అనుచరులపై మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషనులో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం:7లోని ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌లో మాజీ మంత్రి డీకే అరుణ కుమార్తె ధర్మవరం కొట్టం శ్రుతిరెడ్డి నివసిస్తున్నారు. ఆదివారం పీవీపీ అనుచరుడు బాలాజీ, మరికొందరు శ్రుతిరెడ్డి ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ప్రహరీని యంత్రాలతో ధ్వంసం చేశారు. రేకులను తొలగించారు. దీనిపై ప్రశ్నించిన శ్రుతిరెడ్డిని దుర్భాషలాడుతూ భయపెట్టారు. ఈ మేరకు ఆమె ఆదివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరప్రసాద్‌, బాలాజీలతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని