Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ @ 74,434

Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది.

Published : 26 Apr 2024 09:30 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ.. మన సూచీలు ట్రేడింగ్‌ను పాజిటివ్‌గా మొదలుపెట్టాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.30 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టెక్‌ మహీంద్రా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నస్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 89.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ గురువారం నికరంగా రూ.2,823.33 కోట్ల విలువ చేసే వాటాలను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ రూ.6,167.56 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని