Andhra News: పిల్లి కరిచి ఇద్దరు మహిళల మృతి
పిల్లి కరిచిన ఇద్దరు మహిళలు రెండు నెలల అనంతరం ఒకే రోజున మరణించిన దుర్ఘటన శనివారం కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ దళితవాడలోని విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు
కుక్కకాటుకు బలైన పిల్లి
కూచిపూడి (వేములమడ), న్యూస్టుడే: పిల్లి కరిచిన ఇద్దరు మహిళలు రెండు నెలల అనంతరం ఒకే రోజున మరణించిన దుర్ఘటన శనివారం కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ దళితవాడలోని విశ్రాంత కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమలను, ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరు టీటీ ఇంజక్షన్లు చేయించుకొని గాయాలు తగ్గడానికి మందులు వాడటంతో కొద్ది రోజులకు ఉపశమనం కలిగింది. నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కమల మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో, నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా, కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్ సోకిందని వైద్యులు చెప్పారని స్థానికులు తెలిపారు. వారిని కరిచిన పిల్లి కుక్కకాటుకు గురై మరణించిందన్నారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము తదితరాలు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ఆరోగ్య కేంద్రం అధికారి శొంఠి శివరామకృష్ణారావు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు