Suicide: అప్పగింతలు కాకుండానే నవ వధువు ఆత్మహత్య
ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ కూలీ పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు.
పాలమూరు, న్యూస్టుడే: ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ కూలీ పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి(19) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జున్కు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అంతదూరంలోని పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి యువతి చెప్పింది. అయినా పెద్దలు వినలేదు. శుక్రవారం ఉదయం 9గంటలకు వివాహమైంది. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్నగర్ మొదటి పట్టణ ఠాణా ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన