Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం

ఓ తెలుగు సినిమా చూసి మోక్షం పొందాలని గత బుధవారం ఒంటికి నిప్పంటించుకున్న రేణుకా ప్రసాద్‌ (23) అనే యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.

Updated : 13 Aug 2022 06:58 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: ఓ తెలుగు సినిమా చూసి మోక్షం పొందాలని గత బుధవారం ఒంటికి నిప్పంటించుకున్న రేణుకా ప్రసాద్‌ (23) అనే యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా మధుగిరి సమీపంలో ఒక గ్రామానికి చెందిన బాధితుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పిన తర్వాత తన గ్రామంలోనే ఖాళీగా ఉండేవాడు. ఏదో ఒక పని చూసుకోవాలని తల్లిదండ్రులు చెప్పిన మాటను వినిపించుకోలేదు. చాలా ఏళ్ల క్రితం విడుదలైన ఓ తెలుగు సినిమాను 25 సార్లు చూశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే మోక్షం వస్తుందని.. పునర్జన్మ ఉండదని విశ్వసించాడని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ గ్రామశివార్లలో 20 లీటర్ల పెట్రోలును ఒంటిపై పోసుకుని తాను ప్రాణత్యాగం చేసి మోక్షం పొందుతున్నానని సెల్‌ఫోన్‌లో సెల్ఫీవీడియో తీసి, తన తండ్రికి పంపించాక నిప్పంటించుకున్నాడు. బాధితుడ్ని స్థానికులు రక్షించి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రేణుకా ప్రసాద్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని