Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
మహిళలను భయపెట్టో, ప్రలోభపెట్టో నగ్నంగా వీడియో కాల్ చేసేలా ఒత్తిడి తెచ్చి.. దాన్ని రికార్డు చేసి, వారిని బెదిరించి లొంగదీసుకుంటున్నారు పలువురు మోసగాళ్లు. కృష్ణా జిల్లాలో మూడు వారాల వ్యవధిలోనే ఇలాంటివి రెండు కేసులు
రికార్డు చేసి, నిత్యం వేధింపులు
ఇద్దరు నిందితుల అరెస్టు
ఈనాడు, అమరావతి: మహిళలను భయపెట్టో, ప్రలోభపెట్టో నగ్నంగా వీడియో కాల్ చేసేలా ఒత్తిడి తెచ్చి.. దాన్ని రికార్డు చేసి, వారిని బెదిరించి లొంగదీసుకుంటున్నారు పలువురు మోసగాళ్లు. కృష్ణా జిల్లాలో మూడు వారాల వ్యవధిలోనే ఇలాంటివి రెండు కేసులు నమోదవడం గమనార్హం. గత నెలలో కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఓ మోసగాడి వలలో చిక్కి నగ్నంగా వీడియో కాల్ చేసి చిక్కుల్లో పడింది. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తాజాగా.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాహిత నగ్నవీడియో కాల్ను రికార్డు చేసి, బెదిరించిన కేసులో ఇద్దరు నిందితులు కటకటాలపాలయ్యారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలివీ.. రాజమహేంద్రవరానికి చెందిన ఓ వివాహిత.. భర్తతో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది. బతుకుతెరువు కోసం దుకాణం నడుపుకుంటోంది. వ్యాపార అవసరాల కోసం రాజమహేంద్రవరానికి చెందిన హన్సకుమార్ జైన్ అనే వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకునేది. ఇటీవల ఆమె అప్పు అడగ్గా ఎక్కువ వడ్డీ అవుతుందని, ఇష్టమైతేనే తీసుకోవాలని సమాధానమిచ్చాడు. లేనిపక్షంలో నగ్నంగా తనకు వీడియోకాల్ చేయాలని, గెస్ట్హౌస్కు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గత్యంతరం లేక ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది.
దీనిని హన్సకుమార్ స్క్రీన్ రికార్డర్ సాయంతో తన సెల్లో రికార్డ్ చేశాడు. దీన్ని విజయవాడ కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూసి.. తన ఫోన్, ల్యాప్టాప్లోకి కాపీ చేసుకున్నాడు. వీటిని పోర్న్ సైట్లలోకి అప్లోడ్ చేసి, వాటి లింక్ను బంధువులకు పంపిస్తానని చందు ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో తాలూకూ స్క్రీన్ షాట్ను తీసి బాధితురాలితోపాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపాడు. వేధింపులు ఎక్కువవడంతో ఆమె మచిలీపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దీనిని మహిళా పోలీసుస్టేషనుకు బదిలీ చేశారు. కానూరుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన వడ్డీ వ్యాపారి హన్సకుమార్ జైన్ను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!