ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలి చిన్నారి మృతి

ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్రలోని వసాయ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Published : 03 Oct 2022 04:56 IST

ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహారాష్ట్రలోని వసాయ్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తూర్పు వసాయ్‌లోని రాందాస్‌ నగర్‌కు చెందిన షానవాజ్‌ అన్సారీ.. సెప్టెంబరు 23వ తేదీ తెల్లవారుజామున తన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌ పెట్టాడు. అనంతరం ఇంట్లో అందరూ పడుకున్నారు. ఉదయం 5 గంటల సమయంలో బ్యాటరీ ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న షానవాజ్‌ అన్సారీ కుమారుడు షబ్బీర్‌, తల్లి రుక్సాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ షబ్బీర్‌ మరణించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని