Murder: దారుణం.. రాళ్లతో దాడి చేయించి వృద్ధ ప్రియుడి హత్య
బిహార్లోని నలందాలో దారుణం జరిగింది. 75 ఏళ్ల వృద్ధుడిని హత్యచేసి.. మరుగుదొడ్డి ట్యాంక్లో పడేశారు. అక్టోబరు 18న జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
బిహార్లోని నలందాలో దారుణం జరిగింది. 75 ఏళ్ల వృద్ధుడిని హత్యచేసి.. మరుగుదొడ్డి ట్యాంక్లో పడేశారు. అక్టోబరు 18న జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. పిను దేవీ(30) అనే వితంతువు టీ దుకాణం నిర్వహిస్తుండేది. కృష్ణనందన్ ప్రసాద్ (75), సూర్యమణి కుమార్ (60), వాసుదేవ్ పాశ్వాన్ (63), లోహా సింగ్ (62) అనే వ్యక్తులు ఆమె టీ దుకాణానికి వచ్చేవారు. ఈ నలుగురు.. పిను దేవితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత తృపిత్ శర్మ (75) అనే వృద్ధుడు టీ దుకాణానికి వచ్చి పిను దేవితో సన్నిహితంగా ఉండేవాడు. అలా వీరిమధ్య కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. తృపిత్ శర్మతో సంబంధం తెంచుకోవాల్సిందిగా ఆ నలుగురూ ఆమెను హెచ్చరించారు. ఈ క్రమంలో తృపిత్ శర్మను హత్య చేసేందుకు పిను దేవి.. తన నలుగురు ప్రియులతో కలిసి ప్రణాళిక రూపొందించుకుంది. ఇంటికి రమ్మని తృపిత్ను పిలిచింది. పథకం ప్రకారం తన నలుగురు ప్రియులు రాళ్లతో అతనిపై దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని మరుగుదొడ్డి ట్యాంక్లో పడేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు