ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు..పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లుదేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్.
ప్రభుత్వ కార్యాలయాలనూ బ్యాంకులకు కుదువబెట్టిన వైకాపా సర్కారు
రుణాల కోసం ‘జగన్నాటకం’
భవిష్యత్తులో వచ్చే రాబడినీ వదల్లేదు
ఈనాడు, అమరావతి
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు..
పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు
దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్.
సంపద సృష్టించడం చేతగాని జగన్ తాకట్టు పెట్టు.. అప్పు పట్టు.. అంటూ ఎక్కడికక్కడ భూములను కుదువబెట్టారు.
అన్నపూర్ణ అయిన ఆంధ్రావనిని ఐదేళ్లలో అప్పులకుప్పగా మార్చేశారు.
సంపద సృష్టి తెలియదు.. ఉన్న రాబడి చాలదు.. వనరులను పెంచి వాటి నుంచి ఆదాయం తెచ్చే నైపుణ్యం లేదు.. అలాంటివారు ఏం చేస్తారు? అప్పులు ఇచ్చే వారికోసం దిక్కులు చూస్తారు. మరి.. ఆదాయం లేనివారికి రుణం ఎవరు ఇస్తారు? ఇవ్వరు కాబట్టి.. అలాంటివారు ఏదో ఒకటి తాకట్టు పెట్టి.. అప్పు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ది అదే దుస్థితి. రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి అప్పులపైనే జగన్ ప్రధానంగా ఆధారపడ్డారు. తన ఐదేళ్ల పాలనాకాలంలో రుణం కోసం తోచిందల్లా తాకట్టు పెట్టేశారు. ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలను బ్యాంకులకు కుదువబెట్టి రుణాలు తీసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్నే తాకట్టు పెట్టారు. ‘కార్పొరేషన్లకు మీరు ఇచ్చే అప్పుల కోసం నేను గ్యారంటీ ఉంటాను’ అంటూ ఏకంగా సర్కారే జీవోలను జారీ చేసిందంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అయినా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జంకిన బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ‘మాకొద్దు మీ గ్యారంటీ.. భూములో, మరొకటో తాకట్టు పెట్టండి’ అని ముఖం మీదే చెప్పేశాయి. చేసేదేమీ లేక జగన్ సర్కారు ఇష్టారీతిన ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంది. చివరికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిని కూడా ఇప్పుడే కుదువ పెట్టేసింది. ఇంతకంటే దారుణమైన ఆర్థిక పరిస్థితి ఉన్న రాష్ట్రమేదైనా ఉంటుందా? భవిష్యత్తులో వచ్చే రాబడిని తాకట్టు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. జాదూ జగన్.. చట్టాలు, నిబంధనలకు బలాదూర్ కదా..? అందుకే అందినవి అందినట్టు తాకట్టు పెట్టి రూ.వేల కోట్ల రుణం తీసుకున్నారు. అలా తెచ్చిన రుణాన్ని ఆస్తులు సృష్టించే, ఆదాయం సాధించే, రాబడి పెంపొందించే మార్గాలపై వెచ్చించారా అంటే.. అదీ లేదు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని ఖర్చులు చేశారు. ఈ పరిస్థితుల్లో తాకట్టు తాలూకు అప్పులు తీరేదెలా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వేచ్ఛావాయువులను పీల్చేదెప్పుడు?
కార్పొరేషన్లతో ఇష్టారాజ్యం
రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా ఆ సంవత్సరం ఎంత ఉత్పత్తి ఉంటుందో అంచనా వేసి అందులో 3.5 శాతం మేర అప్పులు తీసుకునేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతులు ఇస్తుంది. ఆ పరిమితి దాటి అప్పులు చేయకూడదు. జగన్ సర్కారు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ‘రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్’ను ఏర్పాటు చేసిన వైకాపా సర్కారు.. రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు ఎత్తుగడ వేసింది. మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. అలా వచ్చే మొత్తంలో కొన్ని మద్యం డిపోల ఆదాయం ప్రతినెలా ఖజానాకు వచ్చి అక్కడి నుంచి కార్పొరేషన్కు మళ్లించేలా పథకం పన్నింది. తనకు వచ్చే ఆదాయం నుంచి కార్పొరేషన్ అప్పు తీరుస్తుందని పేర్కొని రూ.25 వేల కోట్లు కావాలని అడిగింది. పైగా ఆ అప్పు తీర్చేందుకు తాను గ్యారంటీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది. ఇంత చేసినా బ్యాంకులు అప్పు ఇచ్చేందుకు భయపడ్డాయి. దీంతో విశాఖలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. వాటి మార్కెట్ విలువ రూ.2,954,03,10,800గా పేర్కొంది. విశాఖ నగరంలోని 13 ఆస్తులకు చెందిన 128.70 ఎకరాలను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తనఖా పెట్టింది. ఈ ప్రభుత్వ భూములను రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు బదలాయించారు.
పర్యాటక శాఖ పార్కు
విజయవాడ నగరంలో కృష్ణా నదీ తీరాన ఐదెకరాల్లో విస్తరించి ఉన్న టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్కును కూడా జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టేసింది. ఆహ్లాదకరమైన బెర్ము పార్కును హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.143 కోట్ల రుణం తీసుకుంది. రోజూ వందల మంది పర్యాటకులు లాంచీల్లో ఆ పార్కును సందర్శించి సేద తీరుతుంటారు. ఇందులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటల్ను కూడా నిర్వహిస్తున్నారు.
టిడ్కో ఇళ్లు..
వైకాపా సర్కారు ఏది దొరికితే దాన్ని తాకట్టు పెట్టేసిందని అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు. గత తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల నివాసానికి నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా కుదువబెట్టి రుణం తీసుకుంది. గృహాల నిర్మాణానికి అప్పటి తెదేపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 260 ఎకరాల భూములను కేటాయించింది. ఆ స్థలాలు, ఇళ్లను తాకట్టు పెట్టి హడ్కో నుంచి రూ.500 కోట్ల రుణం తీసుకుంది.
పోర్టు భూములు..
కాకినాడ జిల్లాలోని పోర్టు భూములను తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడ లేదు ఘనత వహించిన జగన్ సర్కారు. పోర్టుల అభివృద్ధి పేరిట ఎస్బీఐ క్యాప్నకు ఈ భూములను అప్పగించేసింది. కాకినాడలో అప్పటివరకు నిషేధిత జాబితాలో ఉన్న స్థలాలను ఆ పరిధి నుంచి తొలగించారు. ఇలా కాకినాడ నగరం, గ్రామీణ మండలాల పరిధిలోని 337.83 ఎకరాలను కుదువబెట్టి రూ.1,500 కోట్ల అప్పు పుట్టించింది. ఈ స్థలాలను ఏపీ మారిటైం బోర్డు పేరిట బదలాయించి వారితో తనఖా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. కాకినాడలో మొత్తం 1,926.57 ఎకరాల్లో పోర్టు భూములు ఉన్నాయని తేల్చారు. ఇందులో ఇప్పటికే 337.83 ఎకరాలను తాకట్టు పెట్టగా.. మరికొన్ని భూములను కూడా కుదువబెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
భవిష్యత్తు ఆదాయాలు సైతం..
ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడంలో ఆరితేరిన జగన్.. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడిని కూడా వదలలేదు. రాష్ట్రంలో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించి కొన్ని మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు మళ్లించారు. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా చూపి రూ.23,500 కోట్లను అప్పుగా సమీకరించారు. మద్యంపై ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. ఆ మొత్తాన్ని బెవరేజెస్ కార్పొరేషన్.. వివిధ మద్యం బ్రాండ్లపై సుంకం విధించి వసూలు చేసుకునే అధికారం కల్పించింది. బ్యాంకులకు ఈ రాబడి చూపి ఇప్పుడే అప్పు తీసుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో వచ్చే రాబడిని అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టినట్లే లెక్క. ఈ విధానాన్ని రిజర్వు బ్యాంకు తప్పు పట్టినా దాన్ని పట్టించుకోకుండా అప్పు తీసుకున్న ఘనత జగన్కే దక్కింది..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
తాడిపత్రిలో రెండోరోజు కొనసాగిన సిట్ విచారణ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని