అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కుల దాడి
అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కులు దాడి చేసి గాయపర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
ఏబీవోకు గాయాలు... నిందితులపై కేసు
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే: అటవీశాఖ అధికారులపై ఇసుక అక్రమార్కులు దాడి చేసి గాయపర్చిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. వాల్మీకిపురానికి చెందిన బీట్ ఆఫీసర్ సుబ్బలక్ష్మీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రాజారెడ్డి (54) తరిగొండ ఫారెస్ట్ బీట్లో పనిచేస్తున్నారు. చిన్నాయునిచెరువుపల్లె సమీపంలోని తుమ్మకొండ అటవీప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అటవీ ప్రాంతం నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారు. ట్రాక్టర్ నడుపుతున్న సీటీఎం గ్రామానికి చెందిన శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ను మదనపల్లె అటవీశాఖ కార్యాలయానికి తరలించే క్రమంలో రాజారెడ్డి ట్రాక్టర్లో కూర్చోగా సుబ్బలక్ష్మి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఇదే సమయంలో శివకుమార్, అతని ఇద్దరు అనుచరులు ఏబీవో రాజారెడ్డిపై దాడి చేసి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజారెడ్డి వద్ద ఉన్న సెల్ఫోన్, టార్చిలైట్లను తీసుకుని ట్రాక్టరుతో పరారయ్యారు. బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సత్యనారాయణ నిందితుడు శివకుమార్ అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్పోర్టు రన్వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు