Andhra news: పోలీసులపై మట్టిచల్లిన ఆందోళన కారులు.. బొబ్బిలి పారిశ్రామిక వాడలో ఉద్రిక్తత !
స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్ పరిశ్రమ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో
బొబ్బిలి: స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామిక వాడలోని మైథాన్ పరిశ్రమ వద్ద స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న మహిళల్ని అదుపు చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ..వారిని ప్రత్యేక వాహనాల్లో అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వాహనాల్లో వెళ్లేందుకు ఆందోళనకారులు నిరాకరించారు. ఈ క్రమంలో స్థానికులు,పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళలు పోలీసులపై మట్టి చల్లారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్కు తరలించారు. పోలీస్స్టేషన్లో కూడా ఆందోళనకారులు శాంతించలేదు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా తరలించడం సరికాదంటూ.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులు వారించే ప్రయత్నం చేసినా ఆందోళనలు ఉద్ధృతం చేశారు. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మరింత మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు