పెళ్లికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య

కుటుంబ సభ్యులు తమ పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం...

Published : 23 Nov 2020 00:48 IST

మిడ్జిల్‌:  కుటుంబ సభ్యులు తమ పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వేముల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడు (19), బాలిక(15) ఇద్దరు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. వారి కులాలు వేర్వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన ఇరువురు ఆదివారం సాయంత్రం  గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సురేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని