Adilabad: అనుమానంతో భార్యను చంపి.. లొంగిపోయేందుకు వెళ్తూ..

భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Updated : 01 Sep 2023 15:03 IST

ఆదిలాబాద్‌ (నేరవిభాగం): భార్యను హతమార్చిన ఓ వ్యక్తి.. అక్కడికి కొద్దిసేపటిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణానికి సమీపంలోని బంగారుగూడకు చెందిన అరుణ్‌కు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అనుమానంతో శుక్రవారం వేకువజామున దీపను అరుణ్‌ హత్య చేశాడు. అనంతరం లొంగిపోతానంటూ ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఖుర్షిద్‌నగర్‌ వద్ద ఆగి ఉన్న లారీని అరుణ్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు