Mumbai: బాంద్రాలో కారు బీభత్సం.. వాహనాలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

ముంబయిలోని సీలింక్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తొన్న కారు.. మరో ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. 

Published : 10 Nov 2023 04:59 IST

ముంబయి: వేగంగా వెళ్తొన్న కారు అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ముంబయిలోని బాంద్రాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గురువారం రాత్రి ఓ కారు వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తూ సీలింక్‌ వంతెన వద్ద ఉన్న టోల్‌ ప్లాజాను సమీపిస్తుండగా ముందున్న కారును ఢీకొట్టింది. ఆ తర్వాత మరో ఐదు వాహనాలపైకీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని