Crime News: వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి
నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే వరుడు శివకుమార్ మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని శివకుమార్ ప్రాణాలు...
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన శిరీషతో శుక్రవారం వివాహం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శివకుమార్ కోసం వెతకడం ప్రారంభించారు. బోయరేవుల - మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్ పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. చలనం లేకుండా రోడ్డుపై పడిఉన్న ఉన్న అతడిని హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే నవవరుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు