Crime News: ఒకే శ్వాసగా బతికి.. ఒకే చితిపై దహనం
ఏడు దశాబ్దాలకు పైగా అన్యోన్యంగా సాగిన వైవాహిక బంధం వారిది. వృద్ధులైనా పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు ఆసరాగా జీవనయానం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మృతి చెందగా.. ఆ వెంటనే భర్త సైతం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
భార్య మృతిని తట్టుకోలేక.. వృద్ధుడూ బలవన్మరణం
ఎర్ర అంతిరెడ్డి-లక్ష్మమ్మ దంపతులు
చందంపేట, న్యూస్టుడే: ఏడు దశాబ్దాలకు పైగా అన్యోన్యంగా సాగిన వైవాహిక బంధం వారిది. వృద్ధులైనా పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు ఆసరాగా జీవనయానం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మృతి చెందగా.. ఆ వెంటనే భర్త సైతం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(90), లక్ష్మమ్మ(78) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారంతా కుటుంబాలతో పట్టణాల్లో స్థిరపడ్డారు. ఈ వృద్ధ దంపతులు ఉన్న ఊరిని వీడలేక ఇంటిపట్టునే.. ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి లక్ష్మమ్మ బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఈ విషయాన్ని గమనించిన అంతిరెడ్డి.. విషం తాగారు. తెల్లవారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. భార్య లక్ష్మమ్మ చనిపోయి ఉంది. అంతిరెడ్డిని చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలిస్తుండగా దారిలోనే తుదిశ్వాస విడిచారు. భార్య లేని లోకంలో నిమిషమైనా ఉండలేక ఆ పండు వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అంతిరెడ్డి-లక్ష్మమ్మను ఒకే చితిపై కుటుంబసభ్యులు దహనం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం