Hyderabad: తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసిన కేసులో దర్యాప్తు సాగిందిలా..
అప్పు తీర్చాలని అడిగినందుకు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
సైదాబాద్: అప్పు తీర్చాలని అడిగినందుకు నర్సు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి దారుణంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాను సహజీవనం చేస్తున్న మహిళ వద్ద అతడు అప్పు తీసుకొని.. ఆ సొమ్ము తిరిగి ఇమ్మని అడిగినందుకు ఆమెను నిందితుడు చంద్రమోహన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దాదాపు వారం రోజులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తాజాగా ఈ కేసును ఛేదించే క్రమంలో దర్యాప్తు సాగిన తీరును పోలీసు వర్గాలు వెల్లడించాయి.
‘‘అనురాధ హత్యకేసు ఛేదించేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. మృతురాలి తల పడేసిన స్థలం పరిసరాల్లో ఉన్న వందల సీసీ కెమెరాలను మలక్పేట పోలీసులు పరిశీలించారు. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ దిశగా దర్యాప్తును చేశారు. నిందితుడి ఆనవాళ్లు కూడా లేకపోవడంతో పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దాదాపు 100 అనుమానాస్పద వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఎట్టకేలకు నిందితుడు ఉపయోగించిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ చెప్పిన చిరునామా ఆధారంగా నిందితుడి ఇంటిని గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతురాలి తల పడేయడానికి బయటకొచ్చిన సమయంలో నిందితుడు చంద్రమోహన్ మాస్క్ పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడటంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. -
సైబర్ నేరగాళ్ల చేతికి ‘మ్యూల్ ఖాతాలు’
సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు సమకూర్చుతున్న పెద్ద ముఠాలో కీలక సభ్యుడైన ఓ యువకుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. -
రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయి స్వాధీనం
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో రూ.5 కోట్ల విలువైన ద్రవరూప గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన నిందితుడు కస్టడీలో ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టైన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. -
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడి మృతి
ఐస్గా భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు
తెలంగాణ మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ లాక్కొన్నారు.. అడ్డగిస్తే కత్తులతో పొడిచారు
చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని పోతున్న వారిని పట్టుకోబోయిన యువకుడిని నిందితులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన విషాదకర ఘటన హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో జరిగింది.