తెదేపా-జనసేన మ్యానిఫెస్టో.. జనహితమే ఎజెండా
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా.. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ, సమాజంలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెదేపా, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
కూటమి మ్యానిఫెస్టోతో ఏ కోణంలోనూ సరితూగని వైకాపా మ్యానిఫెస్టో
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా.. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ, సమాజంలో అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యమిస్తూ తెదేపా, జనసేన విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మ్యానిఫెస్టో ఎన్డీయే పార్టీల నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపగా.. వైకాపా మ్యానిఫెస్టోపై ఆ పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. తెదేపా-జనసేన మ్యానిఫెస్టోతో పోలిస్తే వైకాపా మ్యానిఫెస్టో తేలిపోయిందన్న భావన వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మహిళలు
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- 19-59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500
- బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 (ఒక తల్లికి ఎంత మంది పిల్లలుంటే అందరికీ)
- డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
- మహిళా ఉద్యోగులకు వసతి సదుపాయం
వైకాపా మ్యానిఫెస్టో
- 45-60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750. కాపు, ఈబీసీ మహిళలకు ఏటా రూ.15 వేలు.
- పిల్లల్ని బడికి పంపించే తల్లికి (ఒక్క బిడ్డకు మాత్రమే) ఏటా రూ.17,000. (ఇందులో పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి పేరిట రూ.2 వేల మినహాయింపు)
- డ్వాక్రా సంఘాలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణాలు
పింఛన్లు
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- ఈ ఏప్రిల్ నుంచే నెలకు రూ.4 వేల పింఛను (జులై నెలలో మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్) బకాయిలు కలిపి ఒకేసారి రూ.7 వేలు చెల్లింపు)
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను
- దివ్యాంగులకు రూ.6 వేలు
- కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలు
వైకాపా మ్యానిఫెస్టో
- పింఛను రూ.3 వేలే. కొత్తగా ఏమీ పెరగదు. 2028 జనవరి నుంచి నెలకు రూ.3,250, 2029 జనవరి నుంచి రూ.3,500 చెల్లిస్తారు. దివ్యాంగులకూ ఇదే పరిస్థితి.
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలు
బీసీ సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
- బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు
- స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు
- స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల ఖర్చు
- రూ.5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ
- తోట చంద్రయ్య, అమర్నాథ్గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు
- గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయింపు
- క్వారీల్లో వడ్డెరలకు 15% రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజ్ల్లో మినహాయింపు
- స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు
- దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు నెలకు రూ.25 వేల గౌరవ వేతనం
- సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
వైకాపా మ్యానిఫెస్టో
- సొంత దుకాణాలున్న నాయీబ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా రూ.10 వేల సాయం
- కులవృత్తిదారులు, చిరువ్యాపారులకు రూ.15 వేలు వడ్డీ లేని రుణం. సక్రమంగా చెల్లించే వారికి ఐదేళ్లలో రూ.20 వేలకు పెంపు
- దేవాలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు నెలకు రూ.20 వేల గౌరవ వేతనం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కొనసాగింపు
- సామాజిక భవనాల నిర్మాణానికి ప్రత్యేక నిది
రైతులు
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష ఆర్థిక సాయం
- రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా
- రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల అమలు
- బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ
- గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
- అన్ని జోన్లలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా
- ట్రాన్స్ఫార్మర్ల ధరల తగ్గింపు, సబ్సిడీపై ఏరియేటర్లు
వైకాపా మ్యానిఫెస్టో
- రైతుభరోసా కింద ఏటా రూ.16 వేల చొప్పున ఐదేళ్లలో రూ.80 వేలు
- గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల కొనసాగింపు
ముస్లిం మైనార్టీల సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- ఇమామ్లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల గౌరవవేతనం
- విజయవాడ సమీపంలో హజ్హౌస్ నిర్మాణం
- నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్ల కేటాయింపు
- మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
- మసీదు నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థిక సహాయం
- హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సహాయం
వైకాపా మ్యానిఫెస్టో
- ఇమామ్లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల గౌరవవేతనం కొనసాగింపు
- ప్రార్థనా స్థలాల నిర్వహణకు ప్రత్యేక నిది
డ్రైవర్ల సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- బ్యాడ్జ్ కలిగిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు
- డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోలుకు 5% వడ్డీతో రూ.4 లక్షల రుణం
- అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద, ఆరోగ్య బీమా
- డ్రైవర్ల సాధికార సంస్థ ఏర్పాటు
- డ్రైవర్ల పిల్లలకు విద్యా రుణాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు
- జీవో 21 రద్దు చేసి, జరిమానాల భారం తగ్గింపు
- వాహనాలపై పెంచిన హరిత పన్ను తగ్గింపు
వైకాపా మ్యానిఫెస్టో
- ఆటో, ట్యాక్సీ, సొంత టిప్పరు/లారీ నడిపే వారికి ఏడాదికి రూ.10 వేలు
- ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం 6 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణం
- రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా
- ఆరోగ్యబీమా ప్రస్తావన లేదు.
వైద్యం- ఆరోగ్య, ప్రమాద బీమా
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా
- అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాల ఏర్పాటు
- బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా జనరిక్ మందులు
వైకాపా మ్యానిఫెస్టో
- ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం
- సహజ మరణానికి రూ.లక్ష, ప్రమాదవశాత్తూ మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా రూ.5 లక్షల సాయం
- గిగ్ వర్కర్స్కు రూ.5 లక్షల ప్రమాద బీమా
- హృద్రోగ బాధితులకు విశాఖ, గుంటూరు, కర్నూలుల్లో వైద్య హబ్లు
- ఆరోగ్య ఆసరా, నాడు-నేడు సహా గత ఐదేళ్లలో అమలు చేసిన కార్యక్రమాలు, పథకాల కొనసాగింపు
గృహనిర్మాణం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- ఇళ్ల నిర్మాణం కోసం పేదలకు పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల నివాస స్థలం
- ఇప్పటికే నివాస స్థలం మంజూరైనా పట్టాలు పొందనివారికి ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్ల నిర్మాణం
వైకాపా మ్యానిఫెస్టో
- కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి నివాస స్థలం (ప్రస్తుతం పట్టణాల్లో 1, గ్రామాల్లో 1.50 సెంట్ల నివాస స్థలం ఇస్తున్నారు.)
- అసంపూర్తిగా మిగిలిపోయిన 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి
- మధ్య తరగతికి దశలవారీగా పట్టణాల్లో ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి
- ఇంటి నిర్మాణానికి పావలా వడ్డీకే రూ.35 వేల రుణం. ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి
విద్యార్థులు
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు
- ఎయిడెడ్ కళాశాలలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ
- కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చర్యలు
- రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం
- డాక్డర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
- ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10% రిజర్వేషన్ల అమలు. ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ల అమలు
వైకాపా మ్యానిఫెస్టో
- ప్రభుత్వ బడుల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు. వారికి నెలకు రూ.12 వేలు స్టైపెండ్, క్రెడిట్లు
- పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దటం
- కోర్టు కేసులను అధిగమించి 18 విశ్వవిద్యాలయాల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీ
- విదేశీ విద్యా దీవెన, నాడు-నేడు, 8వ తరగతి విద్యార్థులకు ఏటా ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు
యువత - ఉపాధి
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే
- ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల
- యువతకు 20 లక్షల ఉద్యోగాలు
- నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
వైకాపా మ్యానిఫెస్టో
- క్రమం తప్పకుండా గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షల నోటిఫికేషన్లు. యూపీఎస్సీ తరహాలో పరీక్షలు
- రాష్ట్రంలో 175 స్కిల్ హబ్లు, 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం అభివృద్ధి
- వాటిలో నైపుణ్య శిక్షణ పొందేవారికి పెయిడ్ ఇంటర్న్షిప్గా నెలకు అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3 వేలు
- విశాఖపట్నంలో స్టార్టప్ హబ్
ఎస్సీ, ఎస్టీ సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- జిల్లాల వారీగా వర్గీకరణ అమలు
- సబ్ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు
- ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ
- ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ
- డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రూ బాయ్, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యకు కారకులైన వారికి కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు
- ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
వైకాపా మ్యానిఫెస్టో
మొత్తం జనాభాలో కనీసం 50 శాతం దళితులు లేదా దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను పంచాయతీలుగా ఏర్పాటు
మత్స్యకారుల సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం
- మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే జీవో 217 రద్దు
- బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సాయం
వైకాపా మ్యానిఫెస్టో
వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం
చేనేత కార్మికుల సంక్షేమం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
- ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం
- చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తిరిగి చెల్లింపు
- పవర్లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
వైకాపా మ్యానిఫెస్టో
మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి మాత్రమే ఏటా రూ.24 వేలు- ఈనాడు, అమరావతి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు 25 స్థానాలైనా దక్కవు: రఘురామకృష్ణరాజు
వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణ రాజు అన్నారు. -
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు.
తాజా వార్తలు
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా