Mahabubnagar: ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది.

Updated : 08 May 2024 08:06 IST

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి స్వల్పంగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలైన వారిలో మియాపూర్‌కు చెందిన వంశీ, బెంగళూరుకు చెందిన ప్రజ్ఞా పరిమిత ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు