Road Accident: స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 09 Nov 2023 11:54 IST

మనోహరాబాద్‌: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి.. వెళితే మెదక్‌లోని రాంనగర్‌కు చెందిన మలైకా సుల్తానా స్కూటీపై ఇద్దరు బాలికలు, ఓ బాలుడిని తీసుకుని మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కల్లకల్‌ వద్దకు రాగానే స్కూటీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వారంతా కింద పడ్డారు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం వారిపైనుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే మలైకా సుల్తానాతో పాటు ఓ బాలిక, బాలుడు మృతిచెందారు. మరో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు