మేడికొండూరు గ్యాంగ్‌రేప్‌: కూలీలను ప్రశ్నించిన పోలీసులు

గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Updated : 09 Sep 2021 14:00 IST

మేడికొండూరు: గుంటూరు జిల్లా మేడికొండూరు వద్ద మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని డీఎస్పీ ప్రశాంతి పరిశీలించారు. సమీపంలోని కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణ పనులకు వచ్చిన ఒడిశా కార్మికులను పోలీసులు విచారించారు. అత్యాచార ఘటన నేపథ్యంలో వారి వద్ద ఉన్న వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలిని వైద్యపరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 

సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్‌పై వస్తుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వస్తున్న దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేశారు. అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని