Crime News: నాన్న కావాలనడమే.. ‘పాప’మైంది
పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు దొరికిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి చంపేసినట్లు తేల్చారు. తల్లితో పాటు ఆమె
వీడిన పంజాగుట్ట బాలిక మృతదేహం కేసు మిస్టరీ
వివరాలు వెల్లడిస్తున్న ఏఆర్ శ్రీనివాస్. చిత్రంలో ఇతర పోలీసు అధికారులు (ముసుగులో నిందితులు)
ఆసిఫ్నగర్, న్యూస్టుడే: పంజాగుట్టలోని ఓ దుకాణం ముందు దొరికిన బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి చంపేసినట్లు తేల్చారు. తల్లితో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. నగర సంయుక్త కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ శనివారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మియాపూర్లోని హఫీజ్పేటకు చెందిన హీనాబేగం(22)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ చోరీ కేసులో ఆరు నెలలుగా జైలులో ఉంటున్నాడు. వీరికి కుమారుడు(7), నాలుగు, మూడేళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్లుకు బానిసైన హీనాబేగం నిత్యం షేక్పేటలోని కల్లు దుకాణానికి వెళ్లేది. ఈ క్రమంలో డబీర్పురా సునార్గల్లీకి చెందిన షేక్ మహ్మద్ ఖాదర్ అలియాస్ రిజ్వాన్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. పెళ్లి చేసుకుని పిల్లల బాధ్యత తీసుకుంటానని వారిని ముంబయి తీసుకెళ్లాడు రిజ్వాన్. అక్కడి నుంచి దిల్లీ, జైపూర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ, భిక్షాటన చేసి జీవనం సాగిస్తూ వచ్చారు.
ఇంటికి వెళ్దామమ్మా..: భిక్షాటన చేయడం, తల్లి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం పెద్ద కుమార్తెకు నచ్చలేదు. ఇంటికెళ్లి నాన్నను కలుద్దాం.. అంటూ ఆ చిన్నారి మారాం చేయడం మొదలు పెట్టింది. దీంతో కోపగించుకున్న హీనాబేగం, షేక్ మహ్మద్ ఖాదర్ ఈనెల 3న బాలికను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. చిన్నారిని తీసుకుని ప్రైవేట్ బస్సులో నగరానికి వచ్చారు. ఖైరతాబాద్లో ఆటో ఎక్కి పంజాగుట్ట ద్వారకాపురి కాలనీ వద్ద దిగి మృతదేహాన్ని పడేసి పారిపోయారు. పోలీసులు నిఘా నేత్రాలను పరిశీలించి నిందితులను జేబీఎస్లో అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్, ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి, డీఐ కె.నాగయ్య, ఎస్సైలు విజయభాస్కర్ రెడ్డి, నాగరాజు, సతీష్కుమార్, సిబ్బంది కేసును ఛేదనలో తీవ్రంగా శ్రమించారని సంయుక్త కమిషనర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..