Crime News: టైరు పేలి కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ మృతి

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు టైరు పేలి మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోగా....

Published : 09 Jan 2022 01:51 IST

హైదరాబాద్‌: జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు టైరు పేలి మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోగా.. 44 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల నుంచి నిర్మల్‌ వెళ్తున్న బస్సు మల్కాపూర్‌ వద్దకు చేరుకోగానే ముందు టైరు పేలిపోయింది. బస్సును నియంత్రిచేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డ్రైవర్‌ మురుగు కాలువలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి తమ ప్రాణాలు కాపాడి మృతిచెందారని ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని