Crime news: మహిళను ముక్కలు చేసి.. దహనం చేసిన దుండగులు

నారాయణ పేట జిల్లా గుండుమల్ మండలం భోగారం గ్రామ శివారులో గ్రామంలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

Published : 12 Nov 2023 16:12 IST

కోస్గి: నారాయణ పేట జిల్లా గుండుమల్ మండలం భోగారం గ్రామ శివారులో మహిళ దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. భోగారం శివారులో రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం కాలిపోయి ఉండటాన్ని గ్రామస్థులు ఆదివారం ఉదయం గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ జనార్దన్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహం ముక్కలుముక్కలుగా దహనం చేసి ఉండటంతో.. హత్య చేసిన అనంతరం తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ టెస్టు, పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని సీఐ జనార్దన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని