అకస్మాత్తుగా బ్రేక్.. రెండు బస్సులు, కారు ఢీ
సిగ్నల్ వద్ద ఓ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక రెండు బస్సులు ఢీకొన్నాయి. ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలివీ.. బీఎన్రెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం మార్గం.. సాగర్ జాతీయ రహదారిపై
ఐదుగురికి గాయాలు.. మరో నాలుగు కార్లు ధ్వంసం
ఢీకొన్న రెండు బస్సులు.. స్తంభించిన ట్రాఫిక్
వనస్థలిపురం, న్యూస్టుడే: సిగ్నల్ వద్ద ఓ కారు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనక రెండు బస్సులు ఢీకొన్నాయి. ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలివీ.. బీఎన్రెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం మార్గం.. సాగర్ జాతీయ రహదారిపై సాగర్ కాంప్లెక్స్ వద్ద కొత్తగా సిగ్నల్ ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురం వైపు నుంచి కారులో వస్తున్న వ్యక్తి రెడ్ సిగ్నల్ పడటంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఆ కారు వెనుక రెండు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. మొదటి బస్సు బ్రేక్ వేసినా.. దాని వెనుకున్న మిథాని డిపో బస్సు బ్రేకులు పడక ముందున్న బస్సును ఢీకొంది. దాంతో అది ముందున్న కారును ఢీకొంది. కారు నుజ్జునుజ్జుకాగా.. బస్సులూ ధ్వంసమయ్యాయి. బస్సుల పక్కన నాలుగు కార్లూ దెబ్బతిన్నాయి. మిథాని బస్సులో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!