నైపుణ్యం పెంచేలా.. సేవలు మెరుగయ్యేలా
ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
విద్యుత్తు సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యుత్తు ఉపకేంద్రంలో శిక్షణ పొందుతున్న ఓఅండ్ఎం సిబ్బంది
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో నష్టాల తగ్గింపుతోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేలా సీఎండీ వరుణ్రెడ్డి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి వృత్తి నైపుణ్యంతోపాటు పనులు మెరుగ్గా చేసేందుకు శిక్షణ దోహదపడనుంది. ప్రాణ, ఆస్తి నష్టాల నుంచి గట్టెక్కించేలా సమాయత్తం చేస్తున్నారు. ఉమ్మడి అయిదు జిల్లాల నుంచి ఓఅండ్ఎం(ఆపరేషన్స్, మెయింటనెన్స్) సిబ్బంది నలుగురు చొప్పున, మరొకరిని నోడల్ అధికారిగా నియమించి గతనెలలో శిక్షణ ఇచ్చారు. దీన్ని జిల్లాస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా విద్యుత్తు సంస్థ అధికారి కార్యాచరణ చేపట్టారు. సిబ్బందిని బృందాలుగా విభజించి పదిరోజులపాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ చేయడం, ముందస్తుగా విద్యుత్తు తీగలు, నియంత్రికలు సరిచేయడం, విద్యుత్తు ప్రమాదాలు (మనుషులు, జంతువులు) పూర్తిగా నివారించడంపై అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది భద్రతా ప్రమాణాలు పాటించడం, వందశాతం బిల్లులు చెల్లించేలా చొరవ తీసుకోవడం, వినియోగదారులకు విద్యుత్తు సమస్యలపై వేదికల ఏర్పాటు, సమస్యలపై స్పందిస్తూ సమయానికి పరిష్కరించేలా చర్యలు ఎలా చేపట్టాలో వివరిస్తున్నారు. వీటిపై అవగాహన కల్పించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.
జేఎల్ఎం నుంచి ఫోర్మెన్ వరకు..
ఒక్కో బృందానికి రెండ్రోజులపాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లాలో జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్, ఫోర్మెన్ ఇలా నాలుగు విభాగాల్లో సేవలందించే ఓఅండ్ఎం సిబ్బంది సుమారు 300 మంది పాల్గొననున్నారు. ఇందులో చాలామంది జేఎల్ఎం, ఏఎల్ఎం స్థాయిలో నూతనంగా కొలువు సాధించిన వారు ఉన్నారు. వీరికి విధుల్లో చేరినప్పటి నుంచి సంస్థ పరంగా ఎలాంటి శిక్షణ లేకపోవడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చనుంది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు శిబిరంలో తెలుసుకోవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. శిక్షణ అనంతరం సిబ్బంది ప్రతిభకు పదును పెట్టేందుకు ప్రత్యేక ప్రశ్నావళితో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
వ్యక్తిగత అప్రమత్తతపై అవగాహన
విద్యుత్తు సంస్థకు సంబంధించిన అంశాలతోపాటు వ్యక్తిగత అప్రమత్తతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ప్రథమ చికిత్స, సీపీఆర్ తదితర అంశాలపై నిపుణులచే సదస్సుల ఏర్పాటుతోపాటు వారితో సాధన చేయిస్తున్నారు. ఆయా బృంద సభ్యులను క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లడంతో పాటు విద్యుత్తు ఉపకేంద్రాల్లో ప్రత్యక్షంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
నాణ్యమైన, అంతరాయంలేని విద్యుత్తు అందించడమే లక్ష్యం
రాథోడ్ శేషారావు, విద్యుత్తు సంస్థ ఎస్ఈ, మంచిర్యాల జిల్లా
జిల్లాలోని విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికలు, సీఎండీ సూచనలతో ముందుకెళ్తున్నాం. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించడమే లక్ష్యంగా సిబ్బంది మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రత్యేక శిబిరాలు ఉపయోగపడనున్నాయి. విభజించిన బృందాలకు రెండ్రోజుల చొప్పున కేటాయించి నిపుణుల సమక్షంలో శిక్షణ అందిస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హజ్ యాత్రికులకు టీకా కార్యక్రమం
[ 02-05-2024]
ఈ ఏడాది జిల్లా నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కమిటీ జిల్లా అధ్యక్షులు షాహిద్ అహ్మద్ ... -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
[ 02-05-2024]
పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. -
శ్రేణులకు నిర్దేశం.. జనజాతరకు సిద్ధం
[ 02-05-2024]
ఆదిలాబాద్లో ఏప్రిల్ 22న ఇప్పటికే జనజాతర సభ పేరిట ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆసిఫాబాద్లో జన జాతర సభ నిర్వహిస్తున్నారు. -
రైస్ మిల్లులకు తాళాలు..
[ 02-05-2024]
జిల్లాలో రైస్ మిల్లుల బాగోతాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. పోలీసుల కేసు నమోదుతో రైస్ మిల్లులకు తాళాలు వేసి వ్యాపారులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క అవకాశం కోసం అడుగుతున్నాం : మంత్రి సీతక్క
[ 02-05-2024]
‘ఆదిలాబాద్ నుంచి తొలిసారిగా ఆదివాసీ ఆడబిడ్డ, సామాన్య మహిళను పార్లమెంటుకు పంపిద్దాం.. ఒక్క అవకాశం ఇవ్వండి.. అన్ని జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. అందుకే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని..’ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. -
ఓపీ చీటీ తీసుకోవటం మరింత సులువు
[ 02-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఓపీ(అవుట్ పేషెంట్) చీటీ తీసుకోవటానికి రోగులు, వారి సహాయకులు ఇక నుంచి గంటల తరబడి వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదు. -
బరిలో 42 మంది.. బ్యాలెట్ యూనిట్లు
[ 02-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుస్థానానికి 42 మంది పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరముంది. -
ఆర్టీయూకేటీ ప్రవేశాల నోటిఫికేషన్కు నిరీక్షణ
[ 02-05-2024]
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల నోటిఫికేషన్ కోసం విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆర్జీయూకేటీలో నేరుగా ప్రవేశాలు పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పని ప్రదేశమే.. ప్రచార వేదిక
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మండుటెండల్లో వచ్చాయి. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎండల దృష్ట్యా తెల్లవారంగానే పలుగు పారబట్టి పనులకు వెళుతున్నారు. -
అగ్నిగోళంగా ఆదిలాబాద్
[ 02-05-2024]
ఉమ్మడి జిల్లాలో బుధవారం సగటు ఉష్ణోగ్రత 42.9 డిగ్రీలు నమోదు కాగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. మూడు రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. గత నెలలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు. -
ముల్లె సదురుకున్నాం.. ఎల్లి పోతావున్నాం!
[ 02-05-2024]
‘ఏమున్నదక్కో.. ఏమున్నదక్కో.. ముల్లె సదురుకున్నా.. ఎల్లి పోతావున్నా.. ఈ ఊళ్లో నాకింక ఏమున్నదక్కో’ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన గేయం ఇక్కడి ఆదివాసీలకు సరిగ్గా సరిపోతోంది. -
పర్యవేక్షణ బరువు.. వ్యవ‘సాయం’కరవు
[ 02-05-2024]
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఎరువుల దుకాణాలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా పురుగుమందులను అన్నదాతలకు అంటగడుతున్నారు. -
మద్యం వ్యాపారుల.. ‘మిలాఖత్’!
[ 02-05-2024]
మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి కల్తీ, నిర్ణయించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
మాటల వేఢీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తూ పల్లెలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. -
తెల్లవారుజామున ఎస్ఈ బదిలీ ఉత్తర్వులు
[ 02-05-2024]
విద్యుత్తు సంస్థ జిల్లా ఎస్ఈ రాథోడ్ శేషారావు ఆకస్మిక బదిలీ అయ్యారు. కార్పొరేట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని బుధవారం తెల్లవారుజామున ఉత్తర్వులు వచ్చాయి. -
మీటరు గిరగిర..
[ 02-05-2024]
సూర్యుడి ప్రతాపంతో జిల్లాలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. వేడి కారణంగా ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అడుగు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. -
ఎట్టకేలకు హస్తం గూటికి..
[ 02-05-2024]
నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎంపీ, మరో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఎట్టకేలకు బుధవారం భారాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. -
భానుడి భగభగలు.. జనం బెంబేలు
[ 02-05-2024]
వేసవితాపంతో అల్లాడి పోతున్నారు జనం. మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొనుగోలుదారులు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. -
సరిహద్దు చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా
[ 02-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేపడుతున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం ముథోల్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. -
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
[ 02-05-2024]
ఆడబిడ్డను పోటీ చేస్తున్నా.. ఆదరించి ఆశీర్వదించండి.. అభివృద్ధి చూసి చూపిస్తానని ఆదిలాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది