logo

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు.

Published : 02 May 2024 09:24 IST

ఎదులాపురం: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఠాకూర్ హోటల్ వద్ద మురుగు కాలువలో గుర్తు తెలియని మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  పట్టణంలో భిక్షాటన చేసే  41 ఏళ్ల వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..  మృతదేహాన్ని రిమ్స్ శవాగారానికి తరలించి భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. కాగా వడదెబ్బ కారణంగా సదరు వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు