logo

గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం

జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Published : 29 Apr 2024 11:12 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలు బి.శ్రీకాంత్, బచ్చు రాకేష్, బచ్చు కృష్ణ కుటుంబ సభ్యులు స్వయంగా భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 2వేల మందికి పైగా భక్తులు భోజనం చేశారు.  అన్నదానం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, ప్రతి సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్న రాములు, కుమ్మరి కృష్ణ, సభ్యులు కిరణ్, ప్రవీణ్, సంజయ్, రమేష్, నర్సింహులు, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొంపల్లి భూమన్న, మేకల అశోక్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని