logo

బంగారం దుకాణాల్లో సందడి

అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది.

Updated : 10 May 2024 13:22 IST

అదిలాబాద్ సాంస్కృతికం: అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణాల్లో వినియోగదారుల సందడి నెలకొంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో జనాలు బంగారం కొనడానికి భారీగా తరలివచ్చారు. 10 గ్రాముల బంగారం ధర రూ.73వేలు ఉన్నప్పటికీ ఇంట్లో ధనలక్ష్మి కళకళలాడుతుందన్న సెంటిమెంటుతో ప్రజలు కనీసం మాసం బంగారం కొనుగోలు చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు ఇవ్వకుండా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని బంగారం దుకాణం యజమానులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు