logo

సీపీఐ నాయకుల ముమ్మర ప్రచారం

మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.

Updated : 10 May 2024 19:11 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సీపీఐ నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఓటర్లను కలిసి ఎన్నికల హామీ కరపత్రాలను అందించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న భాజపాను రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓడించి గద్దె దించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు నళిని రెడ్డి, నాయకులు రాములు, రమేశ్‌ పోచ్చిరామ్, అమీనా ఖాన్, కృష్ణవేణి, గణేశ్‌, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు