logo

ఒడిశాలో తెదేపా నాయకుల ప్రచారం

నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు.

Published : 28 Mar 2024 02:13 IST

ఓటర్లతో మాట్లాడుతున్న మత్స్యకార నాయకులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి మండలానికి చెందిన తెదేపా, జనసేన, భాజపా మత్స్యకార నాయకులు ఒడిశాలో బుధవారం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. మండలం నుంచి మత్స్యకారులు చేపల వేట నిమిత్తం పూరీ, కోణార్క్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ మేరకు మేలో ఎన్నికలు జరగనుండటంతో కూటమి అభ్యర్థి వంగలపూడి అనితతోపాటు కూటమి నుంచి బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని వారిని నాయకులు కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. వైకాపా పాలన కారణంగా ప్రజలంతా నష్టపోయారని వివరించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. పిక్కి శ్రీనివాసరావు, పిక్కి కొర్లయ్య, పిక్కి కోదండరావు, సిరిపల్లి అప్పలరాజు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని