అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు.
పాడేరులో నాయకులతో మాట్లాడుతున్న కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి
పాడేరు, న్యూస్టుడే: రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాజపా కార్యాలయంలో తెదేపా సీనియర్ నాయకులు కె.సుబ్బారావు తదితరులను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం జి.మాడుగుల మండల కేంద్రంలో నాయకులతో భేటీ అయ్యారు. అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. కూటమి నాయకులంతా ఏకమై పాడేరు నియోజకవర్గంలో తనను, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం పాత పాడేరు శివాలయాన్ని సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి తనను గెలిపించాలని కోరారు. భాజపా జిల్లా నాయకులు పరశురామరాజు, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, నాయకులు పి.రవికుమార్, తెదేపా నాయకులు కె.సుబ్బారావు, పిన్నయ్యదొర తదితరులు పాల్గొన్నారు.
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి
అరకులోయ, న్యూస్టుడే: అరకులోయ అసెంబ్లీ, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు పాంగి రాజారావు, కొత్తపల్లి గీతల విజయానికి తెదేపా శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పిలుపునిచ్చారు. అరకులోయ మండలం పద్మాపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో తెదేపా నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. దొన్నుదొర మాట్లాడుతూ.. పాంగి రాజారావు విజయానికి శ్రేణులు పనిచేయాలన్నారు. తెదేపా అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకోవాలని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకు సీటును భాజపాకు ఇవ్వాల్సి వచ్చిందని అధినేత తనకు వివరించారన్నారు. తెదేపా-భాజపా-జనసేన కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు సాధ్యమని చెప్పారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పడిందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలంటే అరకులో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నాయకులు పెట్టెలి దాసుబాబు, శెట్టి బాబూరావు, నీరజ, నిర్మల, బూర్జ లక్ష్మి, భాజపా నాయకులు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు
అరకులోయ, న్యూస్టుడే: తెదేపా- భాజపా- జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. అరకులోయలో బుధవారం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదలకు మేలు జరగాలంటే కూటమి గెలుపు అనివార్యమన్నారు. వైకాపా హయాంలో నిబంధనల పేరుతో సంక్షేమ పథకాల్లో కోత విధించారని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. తెదేపా, జనసేన నాయకులు వంతల నాగేశ్వరరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
జగన్ను ఇంటికి పంపితేనే మన్యం అభివృద్ధి
[ 04-05-2024]
అధ్వాన పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రంపచోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎద్దేవా చేశారు. -
జగనన్న కక్ష.. అవ్వాతాతలకు శిక్ష
[ 04-05-2024]
పింఛను సొమ్ము సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేసే అవకాశం ఉన్నా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులను బలిపశువులను చేసింది. -
వైకాపా పతనం ఖాయం
[ 04-05-2024]
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు తథ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర పేర్కొన్నారు. -
వైకాపా వాహనం స్వాధీనం
[ 04-05-2024]
అనుమతులు లేకుండా వైకాపా ప్రచార సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎంపీడీవో, ఎన్నికల అధికారి వెంకటరావు తెలిపారు. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 04-05-2024]
దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
ఉద్యోగాలిప్పిస్తామని టోకరా
[ 04-05-2024]
ఉద్యోగాలిప్పిస్తామని గిరిజన యువతను ఇద్దరు మహిళలు మోసం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
‘జగన్కు ఒక్క అవకాశమిచ్చి అందరం మోసపోయాం’
[ 04-05-2024]
‘గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చి అందరం మోసపోయాం. ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు. సంక్షేమంలో ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. -
తెదేపాలో చేరిన వైకాపా నాయకులు
[ 04-05-2024]
ఎలమంచిలిలోని దిమిలిరోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్న నందమూరి బాలకృష్ణ సభకు తెదేపా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కూడలిని జెండాలతో అందంగా తయారు చేశారు. -
కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా
[ 04-05-2024]
కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సతక బుల్లిబాబు అన్నారు. మంప, రేవళ్లు పంచాయతీల్లోని గ్రామాల్లో శుక్రవారం సీపీఐ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
జగనన్నా.. ఏమిటీ పింఛన్ వెతలు..
[ 04-05-2024]
పింఛన్లకోసం బ్యాంకులకు వచ్చిన వృద్ధులకు రెండో రోజు కష్టాలు తప్పలేదు. వీఆర్పురం మండలం రేఖపల్లిలో బ్యాంకు వద్ద రేఖపల్లి, జీడిగుప్పల పీహెచ్సీల వైద్యులు శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?