logo

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం నేపథ్యంలో దక్షిణ చిరువోలులంకకు చెందిన బచ్చు శ్రీనివాసరావు (33) 25న రాత్రి దారుణ హత్యకు గురైన ఘటన రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. అవనిగడ్డ ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ తెలిపిన మేరకు.. దక్షిణ చిరువోలులంకకు చెందిన శ్రీనివాసరావు

Published : 27 Sep 2022 05:33 IST

రామచంద్రపురం (అవనిగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం నేపథ్యంలో దక్షిణ చిరువోలులంకకు చెందిన బచ్చు శ్రీనివాసరావు (33) 25న రాత్రి దారుణ హత్యకు గురైన ఘటన రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. అవనిగడ్డ ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ తెలిపిన మేరకు.. దక్షిణ చిరువోలులంకకు చెందిన శ్రీనివాసరావు వ్యవసాయ పనులు చేస్తుంటారు.ఆయనకు రామచంద్రాపురంలోని ఓ వివాహితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 25న రాత్రి శ్రీనివాసరావు ఆమె ఇంటికి వెళ్లగా తనకు ఇష్టం లేదని నిరాకరించింది. ఈ విషయమై జరిగిన ఘర్షణలో ఆమె తండ్రి, మరికొందరు కలిసి దాడి చేయడంతో శ్రీనివాసరావు మరణించారు. మృతుడు శ్రీనివాసరావు భార్య బచ్చు ఉషారాణి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగాయలంక ఎస్సై కుడిపూడి శ్రీనివాసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని