అర్జీలు పెండింగ్లో ఉంచితే చర్యలు: జేసీ
స్పందనకు వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారాలు చూపాలని జేసీ అపరాజితసింగ్ అధికారులను ఆదేశించారు.
దివ్యాంగునికి మంజూరైన రూ.5లక్షల చెక్కు అందజేస్తున్న అపరాజితసింగ్
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: స్పందనకు వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారాలు చూపాలని జేసీ అపరాజితసింగ్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అర్జీలకు పరిష్కారం చూపకుండా పెండింగ్లో ఉంచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జేసీతో పాటు డీఆర్వో వెంకటేశ్వర్లు, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ శివనారాయణరెడ్డి, ఆర్డీవో కిషోర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన ఏడు సమస్యల పరిష్కారం కోరుతూ తెదేపా దివ్యాంగుల విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.ఫణికుమార్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.నరసింహ, సత్యనారాయణ తదితరులు వినతిపత్రం అందజేశారు. విజయవాడ సబ్-కలెక్టర్, తోట్లవల్లూరు తహసీల్దార్ సంతకాలను వీఆర్వో గోపాలకృష్ణ ఫోర్జరీ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన విషయం నిర్ధారణ అయిన దృష్ట్యా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
వాలంటీరు నుంచి ప్రాణహాని ఉంది
పెడన మండలం నందిగామ ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు కె.కృష్ణ తనపై అకారణంగా అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్ వీరాంజనేయులు దాడి చేసి గాయపర్చాడని, కేసు పెట్టినా ఇప్పటి వరకూ చర్యలు లేవని జేసీకి ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ఆరోపణలతో ఫిర్యాదు కూడా చేశాడని అతని నుంచి తనకు ప్రాణహాని ఉన్న దృష్ట్యా తగు రక్షణ కల్పించాలని కోరడంతో కృష్ణ ఫిర్యాదును జిల్లా ఎస్పీకి బదలాయించారు. స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకున్న పెడనకు చెందిన అబ్దుల్రహీంకు నేషనల్ హ్యాండీక్రాప్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.5 లక్షల చెక్కును జేసీ పంపిణీ చేశారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని జేసీ అపరాజితసింగ్ అన్నారు. నషా ముక్తభారత్ అభియాన్లో భాగంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జేసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి బాధితులను గుర్తించాలన్నారు. విద్యా సంస్థల వద్ద నిఘా ఉంచాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.