పశ్చిమ బరిలో సుజనా
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.
భాజపా అభ్యర్థిగా రంగంలోకి కేంద్ర మాజీ మంత్రి
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - వీరులపాడు
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన ఆశించింది. ఆ పార్టీకి కేటాయిస్తే పోతిన మహేష్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అనూహ్యంగా.. ఇది భాజపాకు వెళ్లడంతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఈ సీటు దక్కించుకునేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. భాజపా పోటీ చేస్తుందా? జనసేనకు దక్కుతుందా? అని చర్చనీయాంశంగా మారింది. చివరకు.. బుధవారం రాత్రి భాజపా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో.. అందులో సుజనాకు దక్కడంతో ఎదురుచూపులకు తెరపడింది.
ఇంతింతై...
ఏపీ భాజపాలో కీలక నేతగా ఎదిగిన సుజనా చౌదరి.. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. పొత్తులో విజయవాడ లోక్సభ స్థానం భాజపాకు కేటాయిస్తే.. ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఈ స్థానం తెదేపాకు వెళ్లడంతో అసెంబ్లీ సీటుపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. భాజపాకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో విజయవాడ పశ్చిమ సీటు ఆ పార్టీకి దక్కింది. పశ్చిమ నుంచి పోటీ చేస్తారని ఇటీవల ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీనికి పలువురు పోటీ పడ్డా.. చివరకు అధిష్ఠానం సుజనా పేరునే ఖరారు చేసింది. తెదేపాతో రాజకీయ అరంగ్రేటం చేసిన వైఎస్ చౌదరి.. 2010లో చంద్రబాబు రాజ్యసభకు నామినేట్ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా రెండు దఫాలు 12 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ఆంతరంగికుల్లో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2014లో తెదేపా ఎన్డీఏ కూటమిలో చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించడంతో సుజనా చౌదరి కేంద్ర కేబినెట్లో చేరారు. 2018 వరకు దాదాపు నాలుగేళ్లపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రం నుంచి తెదేపా వైదొలగే వరకు మంత్రిగా పనిచేశారు.
పొన్నవరంపై మమకారం
సుజనా పూర్వీకులది కృష్ణా జిల్లా పామర్రు మండలం పెదమద్దాలి. అంతా గతంలోనే ఇక్కడి నుంచి వలస వెళ్లారు. అమ్మమ్మ గ్రామమైన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో జన్మించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీ నిధులు వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామం మొత్తం భూగర్భ మురుగునీటి కాలవ వ్యవస్థను అభివృద్ధి చేశారు. గ్రామ చెరువు సుందరీకరణ, చుట్టూ నడక బాట, కంచికచర్ల అడ్డరోడ్డు నుంచి రెండు వరసల బీటీ రోడ్డు నిర్మించారు. ఊళ్లో నిరంతరం ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి చికిత్స చేయిస్తున్నారు. కృష్ణా నది నుంచి గ్రామానికి తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకున్నారు. నందిగామలో గత ఏడాది నుంచి సుజనా ఫౌండేషన్ ద్వారా మహిళలు, యువతకు స్వయం ఉపాధి రంగంలో శిక్షణ ఇస్తున్నారు.
సానుకూలతలు పుష్కలం
విజయవాడ పశ్చిమ పరిచయం లేని స్థానం అయినా.. తెదేపాతో సుదీర్ఘ అనుబంధం ఉండడం సుజనాకు ఆ పార్టీ క్యాడర్ నుంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. పొత్తులో తెదేపా, జనసేన ఓట్లు బదిలీ అవుతాయనే ఆశాభావంలో భాజపా ఉంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందనీ, దానికే తొలి నుంచి సుజనా మద్దతుగా పలు దఫాలు మాట్లాడారు. ఇది కూడా ఆయనకు కలిసొస్తుందన్న అభిప్రాయం ఉంది.
విజయవాడ పశ్చిమ
- యలమంచిలి సత్యనారాయణ చౌదరి (వైఎస్ చౌదరి) (63)
- ఎంటెక్, మిషన్ టూల్స్ ఇంజినీరింగ్
- భార్య: పద్మజ. కుమారుడు: కార్తీక్, కుమార్తె: నాగచాందిని
- ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తండ్రి, తల్లి పేరుతో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో పరిశ్రమ స్థాపించారు. మూడు దశాబ్దాల్లో ఉక్కు, విద్యుత్తు, టెలికాం, పట్టణ మౌలిక వసతులు, తదితర రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. 2005లో ఎన్టీఆర్ ట్రస్టు సలహాదారునిగా చేరారు. ఆ సమయంలో ట్రస్టు కార్యకలాపాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తూ తెదేపా అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. తర్వాత 2010లో తెదేపాలో చేరగా రాజ్యసభ సభ్యుడిగా ఆ పార్టీ ఎంపిక చేసింది. అప్పటి నుంచి 2022 వరకు 12 ఏళ్లపాటు ఎంపీగా పనిచేశారు. 2014-18 కాలంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో తాను పుట్టిన పొన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
‘ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు’
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!