logo

‘జగన్‌ క్రైస్తవుల పాలిట సైతాన్‌’

సీఎం జగన్‌ క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. క్రైస్తవులను నమ్మించి మోసం చేసి.. వారి పాలిట సైతాన్‌లా మారారని తెదేపా క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాస్‌ విమర్శించారు.

Updated : 08 May 2024 05:48 IST

పటమట, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని.. క్రైస్తవులను నమ్మించి మోసం చేసి.. వారి పాలిట సైతాన్‌లా మారారని తెదేపా క్రిస్టియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాస్‌ విమర్శించారు. మంగళవారం గురునానక్‌ కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. క్రైస్తవులకు అమలు చేస్తున్న 27 పథకాలను జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారన్నారు. చంద్రబాబు పాలనలో 277 చర్చి నిర్మాణాలు జరిపిస్తే.. జగన్‌ ఒక్క చర్చి నిర్మాణానికి కూడా సాయం చేయలేదన్నారు. క్రైస్తవుడినని చెప్పుకొనే జగన్‌.. వారికి సంక్షేమ పథకాలు అందించడంలో ఎందుకు వెనకడుగు వేశారన్నారు. జగన్‌ చేతిలో మరోసారి మోసపోవడానికి క్రైస్తవులు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి రాష్ట్రంలోని క్రైస్తవులు సిద్దంగా ఉన్నారన్నారు. క్రిస్టియన్‌ సెల్‌ నాయకులు ఉర్ల మోహన్‌ రావు, శ్యామ్‌ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు