భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
మండలంలోని రమణాలవారిపాలెంలో కొత్తపల్లి వెంకటరమణ (28) భర్త ఏడుకొండలు వేధింపులు తాళలేక శనివారం రాత్రి తల వెంట్రుకలకు రంగు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మొదట ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు వినుకొండ
మృతి చెందిన వెంకటరమణ
నూజండ్ల, న్యూస్టుడే : మండలంలోని రమణాలవారిపాలెంలో కొత్తపల్లి వెంకటరమణ (28) భర్త ఏడుకొండలు వేధింపులు తాళలేక శనివారం రాత్రి తల వెంట్రుకలకు రంగు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మొదట ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు వినుకొండ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని రాత్రికి రాత్రే గ్రామానికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు తమ కూతురు ఆత్మహత్యకు అల్లుడే కారణమని పోలీసులకు సమాచారం ఇవ్వగా తిరిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండకు తరలించారు. ఈ మేరకు పోలీస్లకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్కుమార్ తెలిపారు. 12 ఏళ్ల క్రితం కంభంపాడుకు చెందిన వెంకటరమణను రమణాలవారిపాలేనికి చెందిన ఏడుకొండలకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం