హనుమా.. భక్తుల అవస్థలు కానవా?
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి.
రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ
పగిలిన వసతి గదుల కిటికీల అద్దాల్లో ఒకటి
గుంతకల్లు, న్యూస్టుడే : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విడిది చేసే రామదూత నిలయంలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ 16 ఏసీ గదులున్నాయి. 8 గదుల్లో ఏసీలు గత కొన్ని నెలలుగా పనిచేయడంలేదు. ఫలితంగా ఇందులో బస చేసే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిటికీల అద్దాలు పగులడంతో వాటి గుండా కోతులు గదుల్లోకి ప్రవేశించి వస్తువులను పాడు చేస్తున్నాయి. కిటికీలకు మరమ్మతులు చేయించాలని భక్తులు పలుమార్లు ఆలయ అధికారులను విన్నవించినా స్పందన కొరవడింది. వేసవి కాలం కావడంతో భక్తులు ఏసీ గదులనే ఎంపిక చేసుకుంటున్నారు. భగభగమండే ఎండల నేపథ్యంలో ఏసీ గదుల్లో సేద తీరుదామని భక్తులు అధికంగా బాడుగ చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఏసీ పని చేయకపోవడంతో భక్తులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. తాము బాడుగ చెల్లిస్తున్నా ఏసీలు లేకుంటే తాము గదుల్లో ఏవిధంగా విశ్రాంతి తీసుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. గదుల ఏసీలు పనిచేయకుంటే అత్యవసర పనుల కింద వాటికి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక వసతి గదుల సముదాయానికి సంబంధించి గోడలు రంగులు పాలిపోవడంతో కళావిహీనంగా కనిసిస్తున్నాయి. వెంటనే అధికారులు గదుల విషయంలో అవసరమైన మరమ్మతులతో పాటు గదులకు రంగులు వేయించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లగా కోతులు విద్యుత్తు తీగలను నాశనం చేస్తున్న కారణంగా ఏసీలు పనిచేయడం లేదన్నారు. మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పగిలిన కిటికీల అద్దాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయిస్తామని వివరించారు.
ఏసీలు పనిచేయని వసతిగదుల సముదాయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రబీ ముగిశాక పంటనష్ట పరిశీలనా?
[ 17-06-2024]
గత ఏడాది ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రబీ సీజన్లోనూ అదే పరిస్థితి కొనసాగింది. రెండు సీజన్లలోనూ పంటలు పూర్తిగా ఎండిపోయాయి. పశుగ్రాసం కూడా దక్కని దుస్థితి. -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
[ 17-06-2024]
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. దేశవ్యాప్త పరీక్షలో భాగంగా అనంతనగరం, శివారులో ఏడు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. -
జేఎన్టీయూ ఆచార్యులకు జాతీయ పురస్కారాలు
[ 17-06-2024]
అనంతపురం జేఎన్టీయూలోని ఇద్దరు ఆచార్యులను ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) జాతీయస్థాయి అవార్డులకు ఎంపిక చేసింది. ఆచార్య ఈశ్వరరెడ్డి, ఆచార్య వి.బి.చిత్ర ఈ అవార్డులకు ఎంపికైనట్లు ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. -
అనంత నగరానికి రష్యా గుర్తింపు
[ 17-06-2024]
అనంత నగరాన్ని రష్యా దేశం గుర్తించింది. విజయనగర చక్రవర్తుల హయాంలో 15వ శతాబ్దంలో ప్రథమ రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైన అనంతపురాన్ని సందర్శించారు. -
చికెన్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య
[ 17-06-2024]
చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఇళ్లు వదలి వెళ్లమంటున్నారు!
[ 17-06-2024]
అనంతపురం నగర కార్పొరేషన్ అధికారులు నోటీసులిచ్చారు. ఇళ్లు వదిలి వెళ్లిపోమంటున్నారని బాధితులు మొరపెట్టుకున్నారు. -
అంటకాగిన అధికారులను ఉండనిస్తారా.. సాగనంపుతారా!
[ 17-06-2024]
రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత అధికారులు, ఉద్యోగులకు బదిలీల జ్వరం పట్టుకుంది. వారం పది రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. జిల్లాలోనే ఉంచుతారా.. బదిలీ చేస్తారా అన్న ఫోబియాతో ఉన్నారు. -
117 జీవో తక్షణమే రద్దు చేయాలి
[ 17-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగానికి విఘాతం కలిగిస్తున్న 117 జీవో తక్షణమే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
తీరని దాహానికి రూ.కోట్ల ఖర్చు
[ 17-06-2024]
తాజా వార్తలు (Latest News)
-
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
మదనపల్లెలో కిలో టమాటా@ రూ.80
-
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
-
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
-
అభిమాని సూసైడ్.. అలా ఎందుకు చేస్తారో అర్థం కావట్లేదన్న సోనాలి
-
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!