ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం
పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు.
వెంకటాపురంలో మాజీమంత్రి పరిటాల సునీత సమక్షంలో చేరిన నాయకులు
అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), రామగిరి, న్యూస్టుడే: పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు. అందుకే వారంతా తెదేపాలో చేరుతున్నారు. మళ్లీ వారిని భయపెట్టి, బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. రాప్తాడు నియోజకవర్గం నీ సొంత జాగీరా? అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటుగా విమర్శించారు. సోమవారం అనంతపురం, వెంకటాపురం క్యాంపు కార్యాలయాల్లో రాప్తాడు నియోజవర్గంలోని 80 కుటుంబాలు పార్టీలో చేరాయి. అనంతపురం క్యాంపు కార్యాలయంలో అక్కంపల్లి, భోగినేపల్లి, రాప్తాడు, కందుకూరు, పూలకుంట, గ్రామాలకు చెందిన 55 కుటుంబాలు, వెంకటాపురం క్యాంపు కార్యాలయంలో నసనకోట, కొత్తగాదిగకుంట, వెంకటాపురం, మాదాపురం, రామగిరి, తిమ్మాపురం గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు పార్టీలో చేరారు. సునీత, తనయుడు సిద్ధార్థ సమక్షంలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి గెలుపు కోసం పని చేసిన వారు కూడా ఆయనను ఓడించాలని కోరుకుంటున్నారన్నారు. పరిటాల కుటుంబ సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రామగిరిలో శ్రీరామ్ సతీమణి జ్ఞాన, అనంతపురం గ్రామీణం అక్కంపల్లిలో పరిటాల రవీంద్ర సోదరి ఉష, చిన్నకోడలు తేజశ్వి, కురుగుంటలో పరిటాల శైలజ, తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. పరిటాల సునీతకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచకం.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
[ 17-05-2024]
జిల్లా పోలీసు అధికారి అమిత్ బర్దార్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకూ ఆదేశించింది. -
నిరీక్షించి.. ఉక్కపోతతో సొమ్మసిల్లి
[ 17-05-2024]
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సేవలు పొందేందుకు వస్తున్న రోగుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గతంలో ఉన్న ఓపీ కౌంటర్లను అత్యవసర విభాగం వద్ద ఉన్న ఒక రేకుల షెడ్డులోకి మార్పు చేశారు. -
వస్తోంది ఖరీఫ్ సీజన్.. ఏదీ విత్తన కేటాయింపు?
[ 17-05-2024]
జూన్ ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. జిల్లాలో ప్రధాన పంట వేరుసెనగ. ఇప్పటికే వేరుసెనగ కాయలు శుద్ధిచేసి మండల కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచి, కావాల్సిన రైతుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. -
విచక్షణారహిత దాడులు అమానుషం: రామకృష్ణ
[ 17-05-2024]
జిల్లా సీపీఐ, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం ప్రకటనలో ఖండించారు. -
డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు పెట్టాలి: తెదేపా
[ 17-05-2024]
తాడిపత్రిలో తెదేపా నాయకులు, కార్యకర్తలపట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించిన డీఎస్పీ చైతన్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ డిమాండ్ చేశారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత
[ 17-05-2024]
అనంత జేఎన్టీయూ భవన సముదాయంలో భద్ర పరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ వినోద్కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. -
వేసవిలో చల్లని సేవ
[ 17-05-2024]
వేసవిలో ఎండలు మండుతున్నాయి. చిన్నారులతో మొదలు పండుటాకుల వరకు వేడికి తట్టుకోలేకపోతున్నారు. -
పేద మహిళలకు జీవనోపాధి కల్పనే లక్ష్యం
[ 17-05-2024]
పేద మహిళలకు జీవనోపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని నాబార్డు డీజీఎం అనురాధ పేర్కొన్నారు. అనంతపురం గ్రామీణం చంద్రబాబు కొట్టాలలో కార్డు ఆధ్వర్యంలో పేద మహిళలకు.. -
విద్యుత్తు కార్యాలయంలో ఎస్ఈ జన్మదిన వేడుకలు
[ 17-05-2024]
విద్యుత్తుశాఖ ఎస్ఈ సురేంద్ర జన్మదిన వేడుకలను అనంతపురం విద్యుత్తుశాఖ ప్రధాన కార్యాలయం ఎస్ఈ ఛాంబర్లో నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. -
రైల్వే కంట్రోల్ కార్యాలయం.. సేవలు పూజ్యం
[ 17-05-2024]
రైళ్ల రాకపోకలను నియంత్రించడంలో ప్రధాన భూమిక పోషించేది కంట్రోల్ కార్యాలయం. గుంతకల్లు డివిజన్ గుండా వెళ్లే రైళ్లను లోకోపైలెట్లు ఎక్కడ వాటిని ఎక్కడ నిలపాలి అనేది కంట్రోల్ కార్యాలయంలో పనిచేసే కంట్రోలర్లు సూచిస్తారు. -
ఉత్సాహం ఉరకలు.. ప్రోత్సహిస్తే మెరికలు
[ 17-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు క్రీడా శిక్షణ శిబిరాలకు వస్తున్నారు. ఆర్డీటీ క్రీడాగ్రామంలో వివిధ క్రీడాంశాలలో జోరుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణ చర్యలేవీ?
[ 17-05-2024]
సోమందేపల్లి, గోరంట్ల మండలాల పరిధిలోని గుడిపల్లి, పాలసముద్రం నడుమ పారిశ్రామికవాడలో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతూ రోజురోజుకు విస్తరిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు
-
కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేరుస్తుందా?
-
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా