ఓటర్ల ఓపికకు పరీక్ష
సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది.
జిల్లా సచివాలయం : సగటున ఒక నిమిషంలోపే లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు చెరొక ఓటు వేసే వీలున్నా.. గంటలకొద్దీ క్యూలో నిలబడాల్సిన దయనీయ దుస్థితి ఏర్పడింది. ఓటర్ల సహనానికి, ఓపికగా ఎన్నికల సంఘం పరీక్ష పెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగు కేంద్రాల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) జరిగినా ఓటర్ల కేటాయింపు అస్తవ్యస్తం, గందరగోళంగా సాగింది. 1500పైన ఓటర్లు కల్గిన బూత్లను రెండుగా విభజించారు. ఇదే క్రమంలో ఒకే ఆవాస ప్రాంతంలో ఎక్కువ, తక్కువ ఓటర్లు ఉంటే... రెండు బూత్లకు సర్దుబాటు చేసినట్లు వెల్లడించారు. అనంత అర్బన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, శింగనమల, తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1955 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకో బూత్లో సగటున 200పైగా... గరిష్ఠంగా 1500 దాకా ఓటర్లు ఉన్నారు. 21 బూత్లకు ‘ఎ’ను సృష్టించి అదనంగా ఏర్పాటు చేశారు. ఎక్కువ ఓటర్లు కల్గిన బూత్లను రెండుగా విభజించారు. దీంతో అర్ధరాత్రి దాటినా రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరిగింది. మరుసటి రోజు ఈవీఎంలను అప్పగించాల్సి వచ్చింది.
11 గంటలు.. 660 ఓట్లు
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఒకరు లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఓటు వేసేందుకుగాను కనీసం 27 నుంచి 30 సెకన్లు సమయం పడుతుందని అంచనా వేశారు. ఈలెక్కన గంటకు 120 మంది ప్రకారం ఓటు వేసినా... మొత్తం 11 గంటల్లో 1320 మంది ఓటు వేయవచ్చని భావించారు. ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు వేయడానికి కనీసం నిమిషానికిపైగా పట్టింది. ఈ లెక్కన 11 గంటల్లో 660 మందే ఓటు వేయడానికి వీలుంటుంది. గొడవలు, ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే అదనంగా సమయం పడుతుంది. ఒక్కో బూత్లో వెయ్యికిపైగా ఓట్లు కల్గిన ప్రాంతాల్లో నిర్దేశిత సమయం చాలలేదు. జిల్లాలో 1200 మందికిపైగా ఓటర్లు ఉన్న బూత్లు 273 ఉన్నాయి. వెయ్యికిపైగా లెక్కిస్తే సగానికి సగం ఉన్నాయి. దీంతో అర్ధరాత్రి దాటినా పోలింగ్ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగా కాదు.. కూలీగానే పని చేస్తా
[ 18-06-2024]
రాష్ట్రానికి మంత్రినైనా ఉమ్మడి అనంతపురం జిల్లాకు మాత్రం కూలీగానే పని చేస్తానని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
ముళ్లకంప కాదు.. హెచ్ఎల్సీ కాలువ
[ 18-06-2024]
హెచ్చెల్సీ నిర్వహణను గత ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు అధ్వానంగా మారాయి. కంపచెట్లు పెరిగి, పూడిక చేరి నీరు ప్రవహించలేని దుస్థితికి చేరుకొన్నాయి. -
సొంతింటి కల నెరవేరేనా?
[ 18-06-2024]
అందరికీ ఇళ్లు ఇస్తామన్నారు.. వైకాపా పాలనలో ఐదేళ్లుగా అరకొరగా నిర్మించి అసౌకర్యాల మధ్య పట్టాలు అందజేశారు. 2017 సంవత్సరంలో తెదేపా హయాంలో తాడిపత్రి పురపాలికకు టిడ్కో ద్వారా భారీగా ఇళ్లు మంజూరయ్యాయి. -
పౌష్టికాహార కిట్లలో మతలబు
[ 18-06-2024]
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టికాహార కిట్లల్లో మతలబు ఉంది. కిట్లో మొత్తం ఐదు రకాల సరకులు ఉండాలి. -
కార్గిల్ విజయ్ దివస్ యాత్ర ప్రారంభం
[ 18-06-2024]
భారత ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా ద్విచక్ర వాహన దక్షిణ భారత యాత్రను కలెక్టర్ వినోద్కుమార్ ప్రారంభించారు. సంజీవరెడ్డి స్టేడియంలో ఉదయం జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. -
పుష్పగుచ్ఛాలొద్దు.. పుస్తకాలు, పెన్నులు తీసుకురండి
[ 18-06-2024]
‘తెదేపా నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా.. నన్ను కలవడానికి వచ్చేవారు బొకేలు, పుష్ప గుచ్ఛాలు, దండలు, కేకులు, దండలు, శాలువాలు తీసుకురావొద్దు. -
కోడికూర ఇవ్వనందుకే హత్య
[ 18-06-2024]
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో తనకు కోడి కూర ఇవ్వలేదన్న కోపంతో యేసురాజు అనే యువకుడు మురిడెప్ప(50) అనే వ్యక్తిని ఆదివారం బండరాయితో మోది అతిదారుణంగా హత్య చేశాడు. -
హామీల అమలు చరిత్రాత్మకం
[ 18-06-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే ఐదు హామీలపై సంతకాలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. -
కర్రలతో వైకాపా మూకల దాడి
[ 18-06-2024]
కర్రలతో వైకాపా మూకలు దాడికి పాల్పడటంతో పార్వతమ్మకు గాయాలైన ఘటన తనకల్లు మండలంలోని టి.సదుం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. -
శంకరనారాయణ అక్రమాలు వెలుగులోకి తెస్తాం
[ 18-06-2024]
వైకాపా పాలనలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగిన శంకరనారాయణ గతాన్ని మరచి నిరాధారంగా తెదేపా, జనసేన నాయకులపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తెదేపా మండల కన్వీనర్ సోమశేఖర్లు సోమవారం వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. -
భార్యాపిల్లలపై భర్త దాడి
[ 18-06-2024]
పాత గుంతకల్లు అంకాలమ్మ గుడి ప్రాంతంలో నివాసం ఉన్న లక్ష్మి, ఆమె పిల్లలపై భర్త బ్రహ్మయ్య, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారు. -
మాజీ మంత్రి వైఖరితోనే వైకాపా సర్వనాశనం
[ 18-06-2024]
పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణకు అనంతపురం ఎంపీగా టిక్కెట్టు ఇవ్వడంతో రెండు జిల్లాల్లో వైకాపా తుడుచుకుపెట్టుకుపోయిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, గోరంట్ల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు
-
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
-
దేశమంతా చంద్రబాబు వైపు చూస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
-
రుషికొండపై వైకాపా కుప్పిగంతులు!
-
రుషికొండ ప్యాలెస్ గుట్టు బయటపెడతాం: మంత్రి నారా లోకేశ్
-
రేణుకాస్వామి కేసులో కొత్త మలుపులెన్నెన్నో