logo

రంకెలేసిన కోడెగిత్తలు..

చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో గురువారం జల్లికట్టు ఉత్సాహంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను అలంకరించారు.

Published : 27 Jan 2023 02:35 IST

ఉత్సాహం చూపిన యువకులు..

రామిరెడ్డిపల్లిలో నిర్వహించిన పశువుల పరసలో పరుగులు తీస్తున్న ఎద్దు

చంద్రగిరి, చంద్రగిరి గ్రామీణ: చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో గురువారం జల్లికట్టు ఉత్సాహంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పశువులను అలంకరించారు. కొమ్ములకు సినీ హీరోలతో కూడిన పట్టీలు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి వదిలి పెట్టారు. పశువులను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులను నిలువరించే సమయంలో కొందరు గాయపడ్డారు. నిర్వాహకులు 10 మందితో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రామిరెడ్డిపల్లి సర్పంచి కె.చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఉదయం రాగి అంబళి, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించారు.

కానుకల్ని సొంతం చేసుకుంటున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని