మీటర్లు లేక.. దోపిడీ పక్కా!
తెలంగాణకు చెందిన ప్రవీణ్ కుటుంబం విధుల నిమిత్తం తిరుపతికి వచ్చి స్థానికంగా నివాసం ఉంటోంది. ఇటీవల భార్యతో కలసి సొంతూరుకు వెళ్లి తిరిగి రైల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో నారాయణపురం వెళ్లేందుకు స్టేషన్ బయట ఉన్న ఆటోలను ఆశ్రయిస్తే రూ.250 ఛార్జీగా చెప్పి..
ముక్కుపిండి వసూలు చేస్తున్న ఆటోవాలాలు
న్యూస్టుడే, తిరుపతి(నేరవిభాగం)
తెలంగాణకు చెందిన ప్రవీణ్ కుటుంబం విధుల నిమిత్తం తిరుపతికి వచ్చి స్థానికంగా నివాసం ఉంటోంది. ఇటీవల భార్యతో కలసి సొంతూరుకు వెళ్లి తిరిగి రైల్లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆటోలో నారాయణపురం వెళ్లేందుకు స్టేషన్ బయట ఉన్న ఆటోలను ఆశ్రయిస్తే రూ.250 ఛార్జీగా చెప్పి.. రూ.200 ఇస్తే వస్తామన్నారు. అతన్ని కాదని స్టాండ్లో ఉన్నవారెవరూ రాలేని పరిస్థితి ఉండటంతో చేసేది లేక అడిగినంత ఇచ్చి ప్రయాణించారు.
తిరుపతి శివజ్యోతినగర్కు చెందిన కల్యాణి, ఆమె అత్త, ఇద్దరు చిన్న పిల్లలతో కలసి సొంతూరైన నాయుడుపేటకు వెళ్లి తిరిగి ఆర్టీసీ బస్సులో తిరుపతి బస్టాండుకు చేరుకుంది. బస్టాండు బయట ఉన్న ఆటోలను ఆశ్రయించి శివజ్యోతినగర్కు వెళ్లాలంటే రూ.150 అడిగారు. అడిగినంత ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. 80 కి.మీ.ల దూరం ఉన్న తిరుపతి- నాయుడుపేట ప్రయాణానికి ఇద్దరు పెద్దలు, ఒక పాపకు సుమారు రూ.245లు ఛార్జీ చెల్లిస్తే.. బస్టాండు నుంచి 3.5 కి.మీ.ల దూరం ఉన్న శివజ్యోతినగర్కు రూ.150 ఆటోకు ఇవ్వాల్సి వచ్చింది.
ఆర్టీసీ బస్టాండు నుంచి అర కిలో మీటరు దూరం కూడా లేని రైల్వేస్టేషన్కు రూ.80 వసూలు చేస్తున్నారు.
రోజూ లక్ష మంది ఆటోలను ఆశ్రయించే తిరుపతిలో నిర్దిష్ట విధానం అమలు లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏ ఆటోకు మీటర్లు ఉండవు. ఎంత వసూలు చేసినా అడిగే వారు లేరు. కొవిడ్ ముందు ఆటోలకు మీటర్లు ఏర్పాటు చేసి ఛార్జీలు నిర్ణయించారు. అవి కొంత కాలమే నడిచాయి. ఇంధనం ధరలు పెరిగాయంటూ మీటర్ల వినియోగాన్ని పక్కన పెట్టారు. నిర్ణయించిన ఛార్జీలకు మించి వసూలు చేయడం మొదలుపెట్టారు.
సంఘాల అండ
నగరంలో అధికార, అనధికారికంగా సుమారు 17 వేల ఆటోలు నడుస్తున్నాయి. కార్మిక సంఘాల పేరుతో యూనియన్లు.. స్టాండ్లు ఏర్పాటు చేసుకుని ఛార్జీలు నిర్ణయిస్తున్నారు. ఒక ఆటో మరో ప్రాంతంలో ప్రయాణికులను ఎక్కించుకునే అవకాశం లేకుండా.. ఆ ప్రాంతానికి వచ్చిన ప్రయాణికులు అక్కడి ఆటోలోనే ఎక్కేలా వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలా వీధికో స్టాండు ఏర్పాటు చేశారు. అందుకు అండగా ఉంటే యూనియన్లకు నెలవారీగా సొమ్ము చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
ప్రయాణికుల దోపిడీని పట్టించుకోకుండా.. జరిమానాలు, ఇతర వసూళ్లలో ట్రాఫిక్ పోలీసులు బిజీగా ఉంటున్నారు. కొన్ని కూడళ్లలో ఆటో యూనియన్లు ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు తీసుకుని జరిమానాలు వేయకుండా వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మూణ్ణాళ్ల ముచ్చటగా ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్
మూతపడ్డ ప్రీపెయిడ్ ఆటో కౌంటర్
ఆటోల దోపిడీ నుంచి యాత్రికులను కాపాడేందుకు రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్ మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల విశ్రాంతి కేంద్రంగా మారింది. నగర విస్తీర్ణం తక్కువైనా మీటర్ల ఏర్పాటు చేపడితేనే దోపిడీ తగ్గుతుంది. ప్రవేశపెట్టిన త్రిచక్ర యాప్ను అమలు చేస్తే ఆటోలపై నిఘా ఉంటుంది. నగరంలో ఎక్కడా ఆటో ఛార్జీల ధరల పట్టిక కనిపించదు.
ఛార్జీల మోత వాస్తవమే
ఛార్జీల మోత వాస్తవమే. ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఫ్లైఓవర్ పూర్తి అయ్యాక మీటర్లు, ధరల విషయంపై ప్రత్యేక నిఘా పెడతాం. దోపిడీకి గురైన ప్రయాణికులు, యాత్రికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
బారిక నరసప్ప, ట్రాఫిక్ డీఎస్పీ, తిరుపతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోపాలరావు వంక.. గుటకాయ స్వాహా..!
[ 17-05-2024]
కుప్పం- పలమనేరు జాతీయ రహదారి పక్కన భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. మంచి ధరలు పలుకుతుండటంతో.. ప్రభుత్వ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. -
ఎవరి కళ్లకు కడతారు గంతలు?
[ 17-05-2024]
ఎక్కడైనా ప్రకృతి వనరులను అక్రమార్కులు దోచేస్తుంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం రంగంలోకి దిగి తవ్వకాలు, రవాణాను నిలిపేస్తుంది. -
శివయ్యా.. ఇదేం ఘోరమయ్యా
[ 17-05-2024]
శివయ్య సేవలో తరించడానికి వెళ్లిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలను మృత్యువు రూపంలో చెరువు మింగేసింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 17-05-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. -
ప్రవేశాల ప్రకటన ఆలస్యమేనా..?
[ 17-05-2024]
పది తర్వాత వ్యవసాయ పాలిటెక్నిక్లో భాగంగా మూడేళ్లు డిప్లమో చదివితే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ కోర్సుల్లో చేరేందుకు అవసరమైన ప్రవేశ ప్రకటన ఈ ఏడాది ఆలస్యం కానుంది. -
క్షేత్రస్థాయికి వెళ్తే.. కార్యాలయానికి తాళమే
[ 17-05-2024]
సచివాలయ వ్యవస్థతో గొప్ప మార్పు తెచ్చామని.. ప్రజల ముగింటకే అధికారులను తెచ్చామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. -
జీతాలు చెల్లించండి.. మహాప్రభో
[ 17-05-2024]
తమకు న్యాయంగా అందాల్సిన జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయా డెయిరీ కార్మికులు చేపట్టిన నిరసన దీక్ష ఎనిమిది నెలలుగా కొనసాగుతోంది. -
విచారణకు పిలిచి చితకబాదిన ఎస్సై?
[ 17-05-2024]
సోదరుల ఘర్షణ కేసులో విచారణకు పిలిచిన ఎస్సై కులం పేరుతో దూషించి.. లాఠీతో చితకబాదారని రామకుప్పం మండలం వీర్ణమల తండాకు చెందిన వెంకటేశ్నాయక్ ఆరోపించారు. -
సూత్రదారితెన్నూ లేని దర్యాప్తు
[ 17-05-2024]
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఇంకా వైకాపా నేతలకు వంత పాడుతూనే ఉన్నారు. -
బండ వేషం.. జాతర విశేషం
[ 17-05-2024]
గంగజాతరలో బండ వేషధారణలు అలరించాయి. తిరుపతి ప్రజల ఇలవేల్పుగా.. పిలిస్తే పలికే దైవంగా విరాజిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతర రెండోరోజు గురువారం సందడిగా సాగింది. -
వేసవి శిబిరాలు లేనట్టే..!
[ 17-05-2024]
వేసవి సెలవులంటే పాఠశాల విద్యార్థులకు, చిన్నారులకు పండగనే చెప్పాలి. స్నేహితులతో కలిసి ఆటలాడుకుంటూ వినోదం.. ఉల్లాసం.. ఉత్సాహాన్ని పొందుతుంటారు. -
అటకెక్కిన భూసార పరీక్షలు
[ 17-05-2024]
భూసార పరీక్షలు అటకెక్కాయి. సాగులో మట్టి నమూనాలు కీలకం కాగా ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసింది. ఎక్కడో ఓ చోట తీసి అయ్యిందనిపిస్తున్నారు. -
చెవికెక్కించుకుంటే ఇంతే..!
[ 17-05-2024]
వైకాపా నేతలతో భుజాలు రాసుకుని వారి చెప్పినట్లు వంతపాడిన అధికారులపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు అధికారులు నిర్ధారించారు. -
వీరూ ఆ ఫ్యానుముక్కలే
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన జిల్లా పోలీసు బాస్ కృష్ణకాంత్ పటేల్పై బదిలీ వేటు వేసింది. -
ముఖ్యమంత్రి జగన్ను అరెస్టు చేయాలి
[ 17-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో లెక్కకు మిక్కిలి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. -
మహిళా వర్సిటీకి మాయని మచ్చ
[ 17-05-2024]
శ్రీపద్మావతి మహిళా వర్సిటీ అవరణలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన మాయని మచ్చగా మారింది. -
ఆరోగ్య కేంద్రాల సేవలు అరకొరే
[ 17-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలూ వైద్య సేవలు గగనంగా మారాయి. కాన్పులు సైతం జరగడం లేదు. పలుచోట్ల వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి తిరుగుతున్నా.. పట్టించుకునే వారేలేరు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడులు
[ 17-05-2024]
వైకాపా ప్రభుత్వం ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. ఇటీవల వైకాపా మూకల దాడిలో గాయపడిన తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని తనపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి గురువారం పరామర్శించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
[ 17-05-2024]
శ్రీవారిని పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని భాజపా నాయకులు... -
తెదేపా ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారంలో పురోగతి
[ 17-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలో వైకాపా నాయకులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. -
ప్రత్యేక తరగతులు ఎక్కడ?
[ 17-05-2024]
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి సప్లిమెంటరరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన పరీక్షల్లో 2,006 మంది ఫెయిల్ అయ్యారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జేసీ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు ఎస్వీ సెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. -
వేరుసెనగ విత్తన ధర ఖరారు
[ 17-05-2024]
త్వరలో మొదలుకానున్న ఖరీఫ్ సీజన్కు వేరుసెనగ విత్తన కాయల ధరలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
బీసీజీ టీకా వేయించుకోండి
[ 17-05-2024]
జిల్లాలోని వృద్ధులు, 18 ఏళ్లు నిండిన మధుమేహ, క్షయ వ్యాధిగ్రస్థులు, వారి కుటుంబ సభ్యులందరూ అడల్ట్ బీసీజీ టీకాను వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని డీఎంహెచ్వో ప్రభావతీదేవి కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!