నన్ను జైల్లోనే చంపాలని చూశారు
జగన్మోహన్రెడ్డి చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించుకొన్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు
సమావేశంలో మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్టుడే: జగన్మోహన్రెడ్డి చేస్తున్న తప్పులపై ప్రశ్నించినందుకు తనను జైల్లోనే చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించుకొన్నారు. సాయంత్రం రాజమహేంద్రవరంలో అభిమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో మాట్లాడారు. ‘‘నా పుట్టిన రోజునే అరెస్టు చేసి తీసుకెళ్లారు. అదే చనిపోయిన రోజుగా భావించాను. పోలీసు కస్టడీలో ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి చిత్రహింసలకు గురిచేశారు. తెల్లకాగితంపై సంతకం చేయాలని వాదనకు దిగారు. తహసీల్దారు, రెవెన్యూ అధికారులు పేపరుపై సంతకాలు చేయాలని హింసించారు. సంతకం పెడితేనే పంపిస్తామని, లేదంటే ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో నోరువిప్పితే ఇక అంతే సంగతులని భయపెట్టారు. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో మీడియాను కూడా అనుమతించలేదు. కొంతమంది చొరవ తీసుకొని నా కాళ్లను ఫొటోలు తీసి పత్రికల్లో వేశారు. దాంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు. అది తప్పని వాదించాను. దాంతో నాపై కక్ష పెట్టుకొని హింసించారు. ప్రభుత్వ పనుల్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడుతుంటే సరికాదని చెప్పాను. అమరావతి రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లామని.. ఇప్పుడు మార్చడం తగదని చెప్పినా జగన్ మనస్తత్వం మారలేదు. అలాంటి వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదు. ఆయనలో మార్పు రావాలని కోరుకొన్నా. చివరికి ఆయన్నే మార్చాలన్న ఆలోచన ఏర్పడింది. అధికారులు కూడా జరుగుతున్న అన్యాయాన్ని వివరించి బాధపడేవారని రఘురామ వ్యాఖ్యానించారు. నగర ప్రముఖులు, క్షత్రియ సేవాసంఘం ప్రతినిధులు ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నంటే నాన్నే
[ 16-06-2024]
నాన్నంటే ఇష్టంగా మోసే బాధ్యత.. వెన్నంటి నడిచే ధైర్యం.. ఊహకందని త్యాగం.. నడత నేర్పే గురువు.. తన జీవితాన్నే మనకోసం ధారబోసే మహోన్నతుడు. -
మానసిక సంఘర్షణ.. మృత్యుమార్గాన..
[ 16-06-2024]
ఆ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివారు. మహానగరాల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికొచ్చేశారు. -
అమ్మా.. నన్ను క్షమించు
[ 16-06-2024]
‘అమ్మా.. నన్ను క్షమించు. నా స్నేహితుడు శ్రీను.. వాళ్ల మావయ్య మోసం చేశాడు. రూ.35 లక్షలు ఇవ్వాలి. -
కొమ్మనాపల్లిలో అదుపులోకి రాని అతిసారం
[ 16-06-2024]
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన (అతిసారం) మూడోరోజుకూ పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. గ్రామంలోని మరో 28 మంది శనివారం కూడా అస్వస్థత బారిన పడ్డారు. -
వెంకన్న వేడుక చూద్దాం రండి
[ 16-06-2024]
పవిత్ర వైనతేయ నదీ తీరంలో కొలువైన అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. -
అన్నదాత ఆత్మ సంకల్పానికి దెబ్బ
[ 16-06-2024]
పుడమి తల్లిని నమ్ముకుని ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా సమస్యలే. విత్తు వేసింది మొదలు.. దిగుబడి వచ్చే వరకు, ఆ తర్వాత కూడా అనేక సవాళ్లు. -
అక్కడ కూలినా.. ఇక్కడ వేళ్లూనేలా..
[ 16-06-2024]
దశాబ్దాల క్రితం నాటి ఓ రావిచెట్టు కాకినాడ బాలాత్రిపుర సుందరి దేవాలయం రహదారిలో గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. -
పూలబాట పరిచిన పాదాలకు పుష్పాభిషేకం
[ 16-06-2024]
కాకినాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ఫాదర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండ్రులపై చిన్నారులు పూలు చల్లి ఆశీర్వచనం తీసుకున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
-
నీతి ఆయోగ్ చెప్పిందదే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు
-
తిరుమల ప్రక్షాళనకు వేళాయె..!
-
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్8కు ఇంగ్లాండ్
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష